దేశ రాయబారిగా సంజయ్ దత్
ABN , First Publish Date - 2021-11-12T00:45:10+05:30 IST
వివిధ రకాల కేసుల్లో జైలుపాలయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద తనకు తిరుగు లేదని నిరూపించుకున్న నటుడు సంజయ్ దత్. భాషాలకతీతంగా ఆయనకు అభిమానులురంటే అతిశయోక్తి లేదు.
వివిధ రకాల కేసుల్లో జైలుపాలయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద తనకు తిరుగు లేదని నిరూపించుకున్న నటుడు సంజయ్ దత్. భాషాలకతీతంగా ఆయనకు అభిమానులురంటే అతిశయోక్తి లేదు. ప్రస్తుతం కేజీఎఫ్-2లో నటిస్తున్నాడు. ఆ సినిమాలో ‘‘ఆధీరా’’ అనే విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పడానికి ఒక సంఘటన చోటు చేసుకుంది. ఒక దేశ రాయబారిగా ఆయన నియవితులయ్యాడు.
జాంజిబార్ దేశం ఆయనను రాయబారిగా నియమించుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తన సంతోషాన్ని ఆయన వెలిబుచ్చాడు. జాంజిబార్ నేతలతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ దేశంలో పర్యాటకాన్ని ప్రమోట్ చేయడానికి రాయబారిగా ఆయన నియమితులయ్యాడు. ఇన్స్టాగ్రామ్లో ఆయన పోస్ట్ పెడుతూ..‘‘ హుస్సేన్ మ్వినీని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ దేశంలో పర్యాటకాన్ని ప్రమోట్ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ’’ అని ఇన్స్టాగ్రామ్లో ఆయన పోస్ట్ పెట్టాడు.