KGF 3 ఫ్యాన్స్‌కి షాక్.. యూ టర్న్ తీసుకున్న నిర్మాతలు.. ఇప్పట్లో లేదంటూ..

ABN , First Publish Date - 2022-05-15T19:48:31+05:30 IST

బాహుబలి సినిమాల తర్వాత దేశవ్యాప్తంగా అంతటి ఫ్యాన్ బేస్‌ని సంపాదించుకున్న సినిమా ఫ్రాంచైజీ KGF....

KGF 3 ఫ్యాన్స్‌కి షాక్.. యూ టర్న్ తీసుకున్న నిర్మాతలు.. ఇప్పట్లో లేదంటూ..

బాహుబలి సినిమాల తర్వాత దేశవ్యాప్తంగా అంతటి ఫ్యాన్ బేస్‌ని సంపాదించుకున్న సినిమా ఫ్రాంచైజీ KGF. ఈ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ నుంచి 2018లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ సంచలన విజయం దక్కించుకుంది. దీంతో ప్రశాంత్ నీల్, యశ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ సీక్వెల్‌ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో విడుదలైన ఈ మూవీ అంచనాలకు అనుగుణంగా భారీ విజయాన్ని దక్కించుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ. వెయ్యికోట్లకి పైగా కలెక్షన్లని సాధించింది. దీంతో ఈ మూవీకి మూడో పార్ట్‌గా ‘KGF 3’ తెరకెక్కించేందుకు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సిద్ధమవుతున్నట్లు రూమర్స్ వచ్చాయి. 


ఇలాంటి సమయంలోనే ఈ ఏడాది అక్టోబర్ నాటికి మూడో భాగం షూటింగ్ ప్రారంభించి, 2024లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కేజీఎఫ్ నిర్మాత విజయ్ కిరగందూర్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ ఫ్రాంచైజీ అభిమానులు ఎంతో ఖుషి అయ్యారు. అయితే తాజాగా ఈ మూవీ నిర్మాతలు సినిమా షూటింగ్ గురించి యూ టర్న్ తీసుకున్నారు. నిర్మాతల్లో ఒకరూ కార్తీక్ గౌడ అందంతా ఉత్తదే అంటూ ఓ ట్వీట్ చేశాడు. కార్తీక్ చేసిన ట్వీట్‌లో.. ‘నెట్టింట హల్‌చల్ చేస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే. మేము చాలా ఉత్తేజకరమైన ప్రాజెక్ట్‌లతో Hombale Films బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో KGF3 షూటింగ్ సాధ్యం కాదు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే ముందు ప్రకటిస్తాం’ అని రాసుకొచ్చాడు.



Updated Date - 2022-05-15T19:48:31+05:30 IST