షారూఖ్, సల్మాన్‌లతో తనను పోల్చడంపై KGF 2 ప్రమోషన్స్‌లో Yash కామెంట్స్.. ఏదీ శాశ్వతం కాదంటూ..

ABN , First Publish Date - 2022-04-06T23:38:28+05:30 IST

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన సినిమా ‘కేజీఎఫ్-2’. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ‘కేజీఎఫ్’కు సీక్వెల్‌‌గా

షారూఖ్, సల్మాన్‌లతో తనను పోల్చడంపై KGF 2 ప్రమోషన్స్‌లో Yash కామెంట్స్.. ఏదీ శాశ్వతం కాదంటూ..

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన సినిమా ‘కేజీఎఫ్-2’. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ‘కేజీఎఫ్’కు సీక్వెల్‌‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ‘కేజీఎఫ్ -2’ను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. యశ్ కూడా మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ గురించి ప్రస్తావించాడు. 


సినిమాలంటే తనకు చాలా ఇష్టమని యశ్ తెలిపాడు. చిత్రాలను చూస్తూనే పెరిగానని చెప్పాడు. ఇండస్ట్రీలో ఏది శాశ్వతం కాదని వివరించాడు. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో తనను పోల్చడం సరికాదన్నాడు. వాళ్లు సూపర్ స్టార్స్ అని వెల్లడించాడు.  ‘‘నేను నటుడిగా మారడానికి వారే స్ఫూర్తి. ఇండస్ట్రీకి వారు మూల స్తంభాలు. ‘కేజీఎఫ్‌’ను పాన్ ఇండియాగా నిర్మించాం. భాషతో సంబంధం లేకుండా ప్రతి చిత్రం ఆ విధంగానే విడుదల కావాలి. రాజమౌళి ఈ ట్రెండ్ మొదలుపెట్టారు. మేం దానిని కొనసాగిస్తున్నాం. మరిన్ని సినిమాలు ఈ విధంగా రావాలనుకుంటున్నాను’’ అని యశ్ తెలిపాడు. 


సినిమాలను టాలీవుడ్, శాండల్ వుడ్, కోలీవుడ్ అని పిలవడం మానేయాలని యశ్ పేర్కొన్నాడు. ‘‘ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన కంటెంట్‌నైనా చూసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు. ప్రేక్షకులు కూడా ఏ భాషకు చెందినది అని చూడటం లేదు. అన్ని భాషలకు చెందిన చిత్రాలను చూస్తున్నారు. సినీ ఇండస్ట్రీలను టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని పిలవడం మానేయాలి. మనది అంతా ఒకే ఇండస్ట్రీ అని నేను నమ్ముతాను. అదే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ’’ అని యశ్ స్పష్టం చేశాడు. 


Updated Date - 2022-04-06T23:38:28+05:30 IST