‘కెజియఫ్ 2’ సంచలనం.. 10వేలకి పైగా స్ర్కీన్లు.. 40 లక్షల టికెట్స్!

ABN , First Publish Date - 2022-04-14T04:08:08+05:30 IST

కన్నడ స్టార్ హీరో యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందిన ‘కెజియఫ్ 2’ అనేక సంచలనాలకు కేంద్రబిందువు మారి.. నెట్ ప్రపంచంలో దూసుకుపోతుంది. దాదాపు ‘ఆర్ఆర్ఆర్’ మార్గంలోనే ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డులను

‘కెజియఫ్ 2’ సంచలనం.. 10వేలకి పైగా స్ర్కీన్లు.. 40 లక్షల టికెట్స్!

కన్నడ స్టార్ హీరో యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందిన ‘కెజియఫ్ 2’ అనేక సంచలనాలకు కేంద్రబిందువు మారి.. నెట్ ప్రపంచంలో దూసుకుపోతుంది. దాదాపు ‘ఆర్ఆర్ఆర్’ మార్గంలోనే ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డులను క్రియేట్ చేస్తూ టాక్ ఆఫ్ ద వరల్డ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10వేలకి పైగా స్ర్కీన్లలో విడుదల కాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే ఇప్పటికే బుక్ ‌మై షో, పేటీఎమ్ వంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో 40 లక్షలకి పైగా టికెట్స్ అమ్ముడైనట్లుగా కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ అంకెలే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారనే దానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇంకొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం.. మొదటిరోజు భారీ రికార్డులను క్రియేట్ చేయడం ఖాయంగా అయితే కనిపిస్తుంది. యశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, రావు రమేష్, సంజయ్ దత్, రవీనా టాండన్ వంటివారు కీలక పాత్రల్లో నటించారు.



Updated Date - 2022-04-14T04:08:08+05:30 IST