Katrina Kaif నుంచి Priyanka Chopra వరకు.. సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్‌ దక్కని హీరోయిన్ల లిస్ట్ ఇదీ..!

ABN , First Publish Date - 2022-06-20T19:53:44+05:30 IST

సౌత్ సినిమాలు, నటులు బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీదేవి నుంచి సమంత వరకు ఎందరో సౌత్ ఇండియన్ నటీమణులు..

Katrina Kaif నుంచి Priyanka Chopra వరకు.. సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్‌ దక్కని హీరోయిన్ల లిస్ట్ ఇదీ..!

సౌత్ సినిమాలు, నటులు బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీదేవి నుంచి సమంత వరకు ఎందరో సౌత్ ఇండియన్ నటీమణులు బాలీవుడ్‌లో తమ ముద్ర వేసుకోగలిగారు. అయితే కొందరూ బాలీవుడ్ తారలు సైతం సౌత్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే.. వారు విజయం సాధించలేకపోయారు. వారు చేసిన మూవీస్‌లో దాదాపు అన్ని ఫ్లాప్స్‌గానే మిగిలిపోయాయి. అలా సౌత్‌లో ప్రయత్నించి సక్సెస్ కాలేకపోయిన తారల గురించి తెలుసుకుందాం..


ప్రియాంక చోప్రా (Priyanka Chopra)

ప్రియాంక చోప్రా తమిళ చిత్రం ‘తమిజమ్‌’తో సౌత్‌కి పరిచయమైంది. కానీ ఇక్కడ ఆశించిన విజయం దక్కించుకోలేకపోయింది. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా మారింది. అనంతరం రామ్ చరణ్ హీరోగా చేసిన తుఫాన్ చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అది డిజాస్టర్ కావడంతో మళ్లీ ఇటు తిరిగి చూడలేదు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనదైన ముద్ర వేసిన ప్రియాంక చోప్రా సౌత్ ఇండస్ట్రీలో మాత్రం ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది.


కత్రినా కైఫ్ (Katrina Kaif)

వెంకటేశ్ హీరోగా నటించిన ‘మల్లీశ్వరి’తో కత్రినా కైఫ్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా మంచి హిట్ సాధించింది. అనంతరం తెలుగులో ‘అల్లరి పిడుగు’, మలయాళంలో ‘బలరామ్ వర్సెస్ తారదాస్’ సినిమాల్లో కూడా నటించింది. అవి ఫ్లాప్ కావడంతో సౌత్ సినిమాకి దూరమైంది.


బిపాసా బసు (Bipasa Basu)

మహేశ్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘టక్కరి దొంగ’తో తెలుగు పరిశ్రమకి పరిచయమైన నటి బిపాసా బసు. అయితే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా మిగిలింది. దీంతో మరే సౌత్ సినిమాలో ఈ బ్యూటీ నటించలేదు.


ట్వింకిల్ ఖన్నా (Twinkle Khanna)

ట్వింకిల్ ఖన్నా మొదట బాలీవుడ్‌లో మేళా, ఇంటర్నేషనల్ ఖిలాడి వంటి పలు చిత్రాలు చేసింది. అయితే ఆమె చేసిన సినిమాల్లో ఎక్కువ భాగం ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీ సౌత్‌లో ప్రయత్నించింది. వెంకటేష్‌తో హీరోగా చేసిన ‘శీను’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైంది. ఈ సినిమా హిట్ అయింది. కానీ మరే సౌత్ సినిమాలో ట్వింకిల్ నటించలేదు.


అమృతా రావు (Amrita rao)

‘అతిథి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ నటి అమృతారావు. ఈ చిత్రంలో మహేష్ బాబుకి జంటగా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో ఆ తర్వాత మరే సౌత్ మూవీలో ఈ బ్యూటీ కనిపించలేదు.


మనీషా కోయిరాలా (Manisha Koirala)

మనీషా కోయిరాలా ‘క్రిమినల్’ అనే తెలుగు చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ‌తో కలిసి నటించింది. ఈ సినిమా తర్వాత కూడా పలు సౌత్ సినిమాలు చేసింది. అయితే.. బాలీవుడ్‌లో వచ్చిన స్థాయిలో సౌత్‌లో గుర్తింపు రాలేదు.


అయేషా టాకియా (Ayesha Takia)

నాగార్జున హీరోగా చేసిన చిత్రం ‘సూపర్’తో టాలీవుడ్‌కి పరిచయమైన నటి అయేషా టాకియా. ఇదే సినిమాతో అనుష్క శెట్టి తెలుగు చిత్ర సీమకి పరిచయమైంది. అయితే.. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ మూవీ తర్వాత ఏ సౌత్ మూవీలో ఈ బ్యూటీ కనిపించలేదు.


షమితా శెట్టి (Shamita Shetty)

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి చెల్లెలు షమితా శెట్టి. 2002లో విడుదలైన ‘రాజాజీయం’ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో మరే సౌత్ మూవీలో షమితా కనిపించలేదు.

Updated Date - 2022-06-20T19:53:44+05:30 IST