బీచ్ అందాలను ఆస్వాదిస్తూ.. రొమాంటిక్ పిక్స్ పోస్ట్ చేసిన కత్రినా కైఫ్..

ABN , First Publish Date - 2022-04-01T01:11:34+05:30 IST

సెలబ్రిటీ లవ్‌బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గతేడాది డిసెంబర్‌లో

బీచ్ అందాలను ఆస్వాదిస్తూ.. రొమాంటిక్ పిక్స్ పోస్ట్ చేసిన కత్రినా కైఫ్..

సెలబ్రిటీ లవ్‌బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గతేడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం తమ, తమ సినిమాల్లో బిజీగా మారిపోయారు. షూటింగ్‌ల నుంచి విరామం లభించడంతో తాజాగా ఈ జంట హాలీడేను ఎంజాయ్ చేస్తోంది. బీచ్‌లో సేద తీరుతూ అందాలను ఆస్వాదిస్తోంది. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను కత్రినా అభిమానులతో పంచుకుంది. ఈ పిక్స్ పోస్ట్ చేసిన కాసేపటికే నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఈ పోస్ట్‌లపై నెటిజన్లందరూ పొగడ్తల వర్షం కురిపించడం మొదలుపెట్టారు.


కెరీర్ విషయానికి వస్తే.. కత్రినా కైఫ్ ప్రస్తుతం ‘టైగర్-3’ చిత్రీకరణను పూర్తి చేసింది. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ‘ఈద్’ కానుకగా విడుదల కానుంది. ‘ఫోన్ బూత్’ అనే హార్రర్ కామెడీలోను ఆమె నటించింది. ఈ చిత్రంలో సిద్దాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, విక్కీ కౌశల్ ‘ద ఇమ్మోర్టల్ ఆశ్వత్థామ’, ‘తఖ్త్’ సినిమాల్లో నటిస్తున్నాడు. ‘సామ్ బహదూర్’ బయోపిక్‌లో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఇండియన్ ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన మానేక్ షా జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు.



Updated Date - 2022-04-01T01:11:34+05:30 IST