హెలికాప్టర్‌లో పెళ్లి మండపం నుంచి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిన నూతన దంపతులు.. ‘శ్రీమతి కౌశల్’ అంటూ కామెంట్స్

ABN , First Publish Date - 2021-12-10T17:27:17+05:30 IST

యంగ్ హీరో విక్కీ కౌశల్, బ్యూటీఫుల్ కత్రినా కైఫ్ డిసెంబర్ 9 పెళ్లి చేసుకుని అధికారికంగా ఒకటయ్యారు. దీంతో గత కొన్ని నెలలుగా వస్తున్న ఈ కపుల్ పెళ్లి వార్తలకి ఫుల్ స్టాప్ పడినట్లైంది.

హెలికాప్టర్‌లో పెళ్లి మండపం నుంచి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిన నూతన దంపతులు.. ‘శ్రీమతి కౌశల్’ అంటూ కామెంట్స్

యంగ్ హీరో విక్కీ కౌశల్, బ్యూటీఫుల్ కత్రినా కైఫ్ డిసెంబర్ 9 పెళ్లి చేసుకుని అధికారికంగా ఒకటయ్యారు. దీంతో గత కొన్ని నెలలుగా వస్తున్న ఈ కపుల్ పెళ్లి వార్తలకి ఫుల్ స్టాప్ పడినట్లైంది. యంగ్ హీరోతో తన పెళ్లి గురించి ప్రకటిస్తూ సోషల్ మీడియాలో మ్యారేజ్ ఫోటోలు పోస్ట్ చేసిన ఈ బ్యూటీ అందరి ఆశీస్సులు కోరింది.


అయితే, పెళ్లి తర్వాత మొదటి సారి కలిసి పెళ్లి వెన్యూ నుంచి జైపూర్ ఎయిర్‌పోర్ట్‌కి  హెలికాప్టర్‌లో వెళ్లింది ఈ జంట. ఈ నూతన దంపతులు కలిసి  హెలికాప్టర్‌ ఎక్కుతున్న వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమైంది. దీనిపై ఎంతోమంది అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


‘వావ్.. ఎయిర్‌పోర్టు లుక్ కావాలం’టూ కొందరు కామెంట్స్ పెట్టగా.. ‘శ్రీమతి కౌశల్ ఎంతో బావున్నారం’టూ మరికొందరు నెటిజన్లు తమ అభిమానాన్ని తెలుపుతున్నారు. అంతేకాకుండా ఎంతోమంది బాలీవుడ్ ప్రముఖులు వీరికి విషెస్ చెప్పారు. ఆ వైరల్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..



Updated Date - 2021-12-10T17:27:17+05:30 IST