కత్రినా నుంచి కరీనా కపూర్ వరకు.. Alia, Ranbir దంపతులకు ఎవరెవరు ఏమేం గిఫ్ట్‌లు ఇచ్చారంటే..

ABN , First Publish Date - 2022-04-18T21:27:21+05:30 IST

బాలీవుడ్ స్టార్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహానికి బాలీవుడ్ నుంచి అతిరథ మహారథులు అయ్యారు.

కత్రినా నుంచి కరీనా కపూర్ వరకు.. Alia, Ranbir దంపతులకు ఎవరెవరు ఏమేం గిఫ్ట్‌లు ఇచ్చారంటే..

బాలీవుడ్ స్టార్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహానికి బాలీవుడ్ నుంచి అతిరథ మహారథులు అయ్యారు. కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, అయాన్ ముఖర్జీ, ఆకాశ్ అంబానీ తదితరులు హాజరయి ఈ వేడుకలో సందడి చేశారు. బీ టౌన్ స్టార్స్ అనేక మంది నవ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఖరీదైన గిఫ్ట్‌లను ఇచ్చారు. దీపికా పదుకొణె, కత్రినా కైఫ్, రణ్‌వీర్ సింగ్, ప్రియాంక చోప్రా, వరుణ్ ధావన్ తదితర సెలబ్రిటీలు విలాసవంతమైన కానుకలను ఇచ్చారు.


రణ్ బీర్ కపూర్, కత్రినా కైఫ్ కొన్నాళ్లు ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే. ఏమయిందో తెలియందు కానీ, ఆ బంధం పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. కొత్త జంటకు కత్రినా కైఫ్ రూ.14.5లక్షల విలువైన ప్లాటినం బ్రేస్‌లేట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. దీపికా పదుకొణెతో కూడా రణ్‌బీర్ కపూర్ కొన్నాళ్లు ప్రేమాయణం సాగించాడు. అనంతరం పలు కారణాల వల్ల ఈ జంట విడిపోయింది. నూతన దంపతులకు విడివిడిగా దీపిక విలాసవంతమైన వాచ్‌లను బాహుమతిగా ఇచ్చింది. 


‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ సినిమాతోనే ఆలియా భట్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతోనే సిద్దార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ హీరోలుగా వెండితెరపైకి రంగప్రవేశం చేశారు. ఈ మూవీ చేస్తున్నప్పుడే వీరందరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఆలియా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తోంది కాబట్టి సిద్దార్థ్ మల్హోత్రా రూ. మూడు లక్షల విలువ గల లగ్జరీ హ్యాండ్ బ్యాగును కానుకగా ఇచ్చాడు. వరుణ్ ధావన్ మాత్రం ఆలియాకు రూ. నాలుగు లక్షల ఖరీదు గల గూచీ సాండల్స్‌ను బాహూకరించాడు.


బాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఆలియాకు బాహుమతిలిస్తుంటే.. రణ్‌వీర్ సింగ్ మాత్రం కొత్తగా ఉంటుందని రణ్‌బీర్ కపూర్‌కు గిఫ్ట్‌ను పంపించాడు. లగ్జరీ బైక్‌ను కానుకగా ఇచ్చాడు. ప్రియాంక చోప్రా రూ. తొమ్మిది లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను ఆలియాకు బాహుమతిగా ఇచ్చింది. కరీనా కపూర్ రూ. మూడు లక్షల విలువ జేసే డైమండ్ నెక్లెస్‌‌ను బాహుకరించింది. రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ నూతన దంపతులకు దాదాపుగా రూ.26కోట్ల విలువ జేసే ప్లాట్‌ను బాహుమతిగా ఇచ్చింది. 

Updated Date - 2022-04-18T21:27:21+05:30 IST