పెళ్లి తర్వాత కొత్త సినిమా ప్రకటించిన Katrina Kaif.. బాలీవుడ్‌లో మాత్రం కాదు..

ABN , First Publish Date - 2021-12-25T18:15:31+05:30 IST

కొన్ని నెలల సస్పెన్స్ తర్వాత బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ రాజస్థాన్‌లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే...

పెళ్లి తర్వాత కొత్త సినిమా ప్రకటించిన Katrina Kaif.. బాలీవుడ్‌లో మాత్రం కాదు..

కొన్ని నెలల సస్పెన్స్ తర్వాత బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ రాజస్థాన్‌లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వివాహం తర్వాత కత్రినా సినిమాలు తగ్గిస్తుందని అందరూ భావించారు. కానీ మ్యారేజ్ అయ్యి ఓ నెల కూడా గడవకముందే కొత్త సినిమాని ప్రకటించింది. అది కూడా బాలీవుడ్‌లో కాదు ఓ తమిళ నటుడుతో కలిసి కోలీవుడ్‌లో చేస్తోంది ఈ బ్యూటీ.


కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, డైరక్టర్ శ్రీరామ్ రాఘవన్‌తో కలిసి ‘మెరీ క్రిస్‌మస్’ అనే సినిమా చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది కత్రినా. ఈ తమిళ స్టార్స్ కలిసి ఉన్న పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఈ భామ. 


దానికి.. ‘కొత్త ప్రారంభాలు. దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ చేస్తున్న ‘మెర్రీ క్రిస్మస్‌’తో తిరిగి సెట్‌లోకి వస్తున్నందుకు ఆనందంగా ఉంది. నేను శ్రీరామ్ సర్‌తో కలిసి పనిచేయాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నాను. థ్రిల్లర్‌లను చూపించడంలో ఆయన మాస్టర్.. ఆయనకికి ఆయనే సాటి. అందుకే దర్శకత్వంలో నటించడం గౌరవంగా భావిస్తున్నాను. రమేష్ తరాని నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతితో కలిసి పని చేయడాని ఆతృతగా ఎదురుచూస్తున్నా’నని రాసుకొచ్చింది ఈ తార. అయితే 2022లో క్రిస్‌మస్‌కి విడుదల కానున్న ఈ సినిమా నిడివి కేవలం 90 నిమిషాలే ఉంటుందని సమాచారం.



Updated Date - 2021-12-25T18:15:31+05:30 IST