కశ్మీర్‌ టూ హైదరాబాద్‌

ABN , First Publish Date - 2022-05-24T06:07:04+05:30 IST

విజయ్‌దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది...

కశ్మీర్‌ టూ హైదరాబాద్‌

విజయ్‌దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. వై.రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మాతలు. గత నెల 23న కశ్మీర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైన సంగతి తెలిసిందే. అక్కడ అందమైన లొకేషన్లలో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఇప్పుడు ఆ షెడ్యూల్‌ పూర్తయిపోయింది. త్వరలో హైదరాబాద్‌లో మరో దఫా చిత్రీకరణ మొదలెడతారు. ఆ తరవాత వైజాగ్‌, అల్లెప్పిలలో షూటింగ్‌ కొనసాగిస్తారు. ‘‘కశ్మీర్‌లోని ఆహ్లాదరమైన లొకేషన్లలో షూటింగ్‌ పూర్తి చేశాం. ‘ఖుషి’ అనే టైటిల్‌కు ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. డిసెంబరు 23న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి విడుదల చేస్తామ’’ని చిత్రబృందం తెలిపింది. జయరాం, సచిన్‌ ఖేడేకర్‌, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, వెన్నెల కిషోర్‌ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌. 


Updated Date - 2022-05-24T06:07:04+05:30 IST