అల వైకుంఠపురములో హిందీ రీమేక్ Shehzada లో Allu Arjun గెస్ట్ రోల్..? Kartik Aaryan ఏం తేల్చాడంటే..

ABN , First Publish Date - 2022-07-22T19:30:45+05:30 IST

బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) ఒకరు. వరుసగా సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న..

అల వైకుంఠపురములో హిందీ రీమేక్ Shehzada లో Allu Arjun గెస్ట్ రోల్..? Kartik Aaryan ఏం తేల్చాడంటే..

బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) ఒకరు. వరుసగా సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న ఈ నటుడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే విడుదలైన ‘భూల్ భూలయ్యా 2’ సూపర్ హిట్ అవ్వడంతో ఈ నటుడి క్రేజ్ మరింత పెరిగింది. ఈ తరుణంలో అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ రిమేక్‌లో నటిస్తున్నాడు.


ఈ చిత్రం ‘షాహజాదా (Shehzada)’ పేరుతో హిందీలో రిమేక్ అవుతోంది. కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా.. ఈ మూవీ గురించి తాజాగా ఓ క్రేజీ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అల్లు అర్జున్ (Allu Arjun) ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడనేది ఆ వార్త సారాంశం. ఈ బాలీవుడ్ మూవీ నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు కావడం. ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్‌కి దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరగడంతో ఈ న్యూస్ నిజమేననే అందరూ అనుకున్నారు. అవి రూమర్స్ మాత్రమేనంటూ తాజాగా కార్తీక్ ఆర్యన్ ఈ వార్తలని కొట్టిపడేశాడు.


కార్తీక్ మాట్లాడుతూ.. ‘అలాంటిదేం లేదు. అల్లు అర్జున్ మా సినిమాలో ఎటువంటి అతిథి పాత్ర చేయట్లేదు. కాకపోతే ఆయన తండ్రి అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. ‘లుకా చుప్పి’ వంటి సూపర్ హిట్ తర్వాత కార్తీక్, కృతి కలిసి నటిస్తున్న మూవీ కావడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి కార్తీక్ మరి కొన్ని ప్రాజెక్టులలో నటించాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల వాటి నుంచి ఈ యువ నటుడు బయటికి వచ్చాడు.

Updated Date - 2022-07-22T19:30:45+05:30 IST