Karthikeya 2: బాక్సాఫీసు నంబర్ కాదు.. భావోద్వేగం!
ABN , First Publish Date - 2022-08-27T05:47:44+05:30 IST
‘కార్తికేయ 2’ (kartikeya 2)ప్రై ప్రేక్షకులు చూపించిన ప్రేమ రూ.100 కోట్లతో సమానమని హీరో నిఖిల్ (Nikhil)అన్నారు. సినిమా అంటే బాక్సాఫీసు నంబర్లు కాదని, అదొక భావోద్వేగమని ఆమన పేర్కొన్నారు. నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2’ చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరిన సందర్భంగా కర్నూల్లో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.
‘కార్తికేయ 2’ (kartikeya 2)ప్రై ప్రేక్షకులు చూపించిన ప్రేమ రూ.100 కోట్లతో సమానమని హీరో నిఖిల్ (Nikhil)అన్నారు. సినిమా అంటే బాక్సాఫీసు నంబర్లు కాదని, అదొక భావోద్వేగమని ఆమన పేర్కొన్నారు. నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2’ చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరిన సందర్భంగా కర్నూల్లో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్(Anupama parameswaran) జంటగా చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల– ఘన విజయం సాధించింది. బాలీవుడ్లో 50 థియేటర్లతో మొదలై వంద స్ర్కీన్ల మార్క్ను చేరింది.
నిఖిల్ మాట్లాడుతూ ‘‘బాహుబలి’తో ప్రభాస్, ‘పుష్ప’తో బన్నీ, ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్; చరణ్ తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చూపించారు. ‘కార్తికేయ 2’నార్త్తో విడుదలవుతుందీ అంటే భయమేసింది. నా సనిమా ఏంటి బాలీవుడ్కి వెళ్లడమేంటి?’ అని నేను అనుకున్నట్లుగానే చాలామంది అలాగే అనుకున్నారు. కానీ విడుదలయ్యాక పరిస్థితికి వేరేలా ఉంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా 1200 స్ర్కీన్స్లో ఆడుతోంది. ఇది ‘కార్తికేయ 2’ విజయం కాదు తెలుగు సినిమా విజయం. తెలుగువారిగా గర్వపడాల్సిన సందర్భమిది’’ అని అన్నారు. ప్రేమమ్, శతమానం భవతి చిత్రాల తర్వాత నా కెరీర్లో భారీ విజయం సాధించిన చిత్రమిది. కెరీర్లో నిలిచిపోయే చిత్రమిది’’అని అనుపమా పరమేశ్వరన్ అన్నారు.