Narayana Das Narang కు ‘కార్తికేయ-2’ చిత్రం అంకితం - అభిషేక్ అగర్వాల్
ABN , First Publish Date - 2022-08-14T22:27:31+05:30 IST
యంగ్ హీరో నిఖిల్ (Nikhil), మల్లూ కుట్టి అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) జోడీగా.. చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో తాజాగా విడుదలైన చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). నిన్ననే (ఆగస్ట్ 13) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.
యంగ్ హీరో నిఖిల్ (Nikhil), మల్లూ కుట్టి అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) జోడీగా.. చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో తాజాగా విడుదలైన చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). నిన్ననే (ఆగస్ట్ 13) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. అన్ని చోట్లా యునానిమస్ టాక్ వినిపిస్తోంది. ఈ సంధర్బంగా ‘కార్తికేయ- 2’ చిత్ర బృందం థాంక్స్ మీట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్, దర్శకుడు చందు మొండేటి పాల్గొన్నారు.
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. ‘దర్శకుడు చందు మొండేటి కథ చెప్పిన దానికంటే, అద్భుతంగా ఈ సినిమాను తీశారు. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. సినిమాకి అని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెబుతూ కార్తికేయ సాంకేతిక నిపుణలకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ.. ‘రెండు పాండమిక్స్ తరువాత ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా సక్సెస్ తో ఆ కష్టం అంతా మర్చిపోయాను. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది నేను చాలా ఎమోషనల్ ఐపోయాను. చాలా సంతోషంగా ఉంది. థాంక్స్ ఫర్ యూ సపోర్ట్’ అన్నారు.
హీరో నిఖిల్ మాట్లాడుతూ... ‘మీడియా మిత్రులకు చాలా థాంక్స్ అండి, ఈ సినిమాకి యూఎస్ ముందుగానే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ రిజల్ట్ కోసం వెయిట్ చేసాం. ఇక్కడ సినిమా అవ్వగానే నాకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. అన్నీ చోట్ల హౌస్ ఫుల్ అవుతున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. నా సినిమా హిట్ అవ్వాలని చాలామంది కోరుకున్నారు. బుకింగ్స్ బాగున్నాయి. ఇది ఇలానే కొనసాగుతుంది అని నేను అనుకుంటున్నాను. చందు మంచి పాయింట్ తీసుకుని అద్భుతంగా తీశాడు’ అని చెబుతూ చిత్రం టెక్నీషియన్స్కు కృతజ్ఞతలు తెలిపారు.