చూపుతో ఊపిరి ఆపినావే.. అలరిస్తోన్న ‘Karthikeya 2’ వీడియో సాంగ్
ABN , First Publish Date - 2022-07-13T01:04:41+05:30 IST
ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో వచ్చిన సక్సెస్ఫుల్ చిత్రం ‘కార్తికేయ’కి సీక్వెల్గా.. అదే కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం
ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ (Nikhil), దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti) కాంబినేషన్లో వచ్చిన సక్సెస్ఫుల్ చిత్రం ‘కార్తికేయ’కి సీక్వెల్గా.. అదే కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ కార్తికేయ 2’ (Karthikeya 2). క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది.. సినిమాపై భారీగా అంచనాలను పెంచుతూ వస్తున్నాయి. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ 1 అయితే ఆ అంచనాలను డబుల్ చేసింది. ఇప్పటికీ ట్రైలర్ ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాలోని ‘నన్ను నేను అడిగా’ అనే లిరిక్స్తో రూపొందిన వీడియో సాంగ్ని మేకర్స్ విడుదల చేశారు. పాటలోని విజువల్స్, నిఖిల్-అనుపమల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్లో టాప్లో ట్రెండ్ అవుతోంది.
‘‘అడిగా నన్ను నేను అడిగా.. నాకెవ్వరు నువ్వని..
అడిగా నిన్ను నేను అడిగానే.. నిన్నలా లేనని..
నవ్వుతూ నన్ను కోసినావే గాయమైన లేకనే..
చూపుతో ఊపిరి ఆపినావే.. మార్చి నా కథ ఇలా..
నువ్వే కదా ప్రతీ క్షణం క్షణం పెదాలపై..
నీతో ఇలా ఇలా జగం సగం నిజం కదా..’’ అంటూ సాగిన ఈ పాట.. సంగీత దర్శకుడు కాలభైరవ అందించిన స్వరాలతో వినసొంపుగా ఉంది. ఈ పాటకి కృష్ణ మాదినేని సాహిత్యం అందించగా.. ఇన్నొ జెంగా ఆలపించారు. ఒక ప్రేమికుడు.. తన ప్రియురాలిని ఊహించుకుంటూ పాడుకుంటున్నట్లుగా ఉన్న ఈ పాటని.. పిక్చరైజేషన్ కూడా చాలా చక్కగా చేశారు. ‘కార్తికేయ’ చిత్రంలానే ఈ చిత్రం కూడా నిఖిల్కు మంచి విజయాన్ని అందించే చిత్రంగా నిలుస్తుందని చిత్రయూనిట్ భావిస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని ముందు అనుకున్నట్లుగా జూలై 22న కాకుండా.. ఆగస్ట్ మొదటి వారంలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.