మళ్లీ పెళ్లి చేసుకుంటారా అని అడిగిన ఫ్యాన్.. Karisma Kapoor ఫన్నీ రియాక్షన్ ఇదే..
ABN , First Publish Date - 2022-04-29T15:16:21+05:30 IST
బాలీవుడ్ నటి కరీష్మా కపూర్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో అభిమానుల కోసం ఏఎమ్ఏ (నన్ను ఏదైనా అడగండి) సెషన్ని నిర్వహించింది..
బాలీవుడ్ నటి కరీష్మా కపూర్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో అభిమానుల కోసం ఏఎమ్ఏ (నన్ను ఏదైనా అడగండి) సెషన్ని నిర్వహించింది. అందులో కరిష్మా తనకు ఇష్టమైన వ్యక్తుల నుంచి ఇష్టమైన ఆహారం వరకు అనేక రకాల ప్రశ్నలకు సమాధానమిచ్చింది. రణబీర్ కపూర్ లేదా రణవీర్ సింగ్ల్లో ఎవరంటే ఎక్కువ ఇష్టమో తెలిపింది. అలాగే ఫ్యాన్స్ అడిగిన మరి కొన్ని ప్రశ్నలకు ఎంతో ఫన్నీగా సమాధానాలు తెలిపింది.
కరిష్మా నిర్వహించిన ఆ సెషన్లో కొందరు ఆమెకి ఇష్టమైన ఆహారం గురించి అడగగా (బిర్యానీ) అని, ఇష్టమైన రంగు నలుపు అని అంటూ చెప్పుకొచ్చింది. మరికొందరు వ్యక్తిగత ప్రశ్నలు సైతం అడిగారు. అందులో ఓ అభిమాని ‘మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా’ అని ఒక అభిమాని అడిగాడు. దానికి ‘సందర్భాన్ని బట్టి ఉంటుంది’ ఉంటుందని కరిష్మా తన శైలిలో స్పందించింది. అంతేకాకుండా దానికి తగిన ఎక్స్ప్రెషన్స్ ఉండేలా ఓ నటి పిక్ని షేర్ చేసింది. దీనిపై ఎంతోమంది నెటిజన్లు సమాధానాన్ని సిద్ధంగా ఉంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు.