Koffee With Karan: కార్తిక్ ఆర్యన్కు ఆహ్వానం పంపిన కరణ్ జోహార్
ABN , First Publish Date - 2022-09-05T00:03:52+05:30 IST
బాలీవుడ్లో స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగిన నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan). ‘సోనూ కే టీటూ కీ స్వీటీ’ (Sonu Ke Titu Ki Sweety), ‘పతి, పత్నీ ఔర్ వో’ (Pati Patni Aur Woh) చిత్రాలతో ప్రేక్షకులకు
బాలీవుడ్లో స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగిన నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan). ‘సోనూ కే టీటూ కీ స్వీటీ’ (Sonu Ke Titu Ki Sweety), ‘పతి, పత్నీ ఔర్ వో’ (Pati Patni Aur Woh) చిత్రాలతో ప్రేక్షకులకు చేరువయ్యాడు. తాజాగా ‘భూల్ భూలయ్యా-2’ (Bhool Bhulaiyaa 2) లో నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ ఏడాది బాలీవుడ్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా కార్తిక్ ఆర్యన్కు సంబంధించిన ఓ వార్త బీ టౌన్లో హల్చల్ చేస్తుంది. అతడు ‘కాఫీ విత్ కరణ్’ చాట్ షోలో పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది.
కార్తిక్ ఆర్యన్ 2019లో ‘కాఫీ విత్ కరణ్’ చాట్ షోలో పాల్గొన్నాడు. ‘లూకా చప్పీ’ ప్రమోషన్స్లో భాగంగా కృతి సనన్తో కలసి ఈ షోలో సందడి చేశాడు. కానీ, కరణ్ జోహార్ తాను నిర్మిస్తున్న ‘దోస్తానా-2’ (Dostana-2) నుంచి కార్తిక్ను తప్పించాడు. సృజనాత్మక విభేదాలతోనే అతడిని తప్పించామని పేర్కొన్నాడు. ఓ ప్రకటనను కూడా విడుదల చేశాడు. కొత్త వారితో ప్రాజెక్టును మొదలుపెట్టాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు ఆకాశనంటాయి. దీంతో కార్తిక్ అప్పుడప్పుడు కరణ్ జోహార్పై పరోక్షంగా సెటైర్లు కూడా వేశాడు. కానీ, ఎప్పుడు వీరిద్దరు ఈ విభేదాలపై స్పందించలేదు. ప్రస్తుతం అవి సమసిపోయినట్టు తెలుస్తోంది. ఫలితంగా ‘కాఫీ విత్ కరణ్’ షో లో త్వరలోనే అతడు పాల్గొనబోతున్నట్టు సమాచారం. ‘భూల్ భూలయ్యా-2’ హిట్తో కార్తిక్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో నిర్మాతలతో పాటు పలు కంపెనీల ప్రతినిధులు అతడి క్రేజ్ను సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. కొన్ని రోజుల క్రితం ఓ కంపెనీ పాన్ మసాలా యాడ్లో నటించమని కార్తిక్ను అడిగింది. రూ.9కోట్లను ఆఫర్ చేసింది. అయినప్పటికి, ఆ యాడ్ను చేసేందుకు కార్తిక్ మాత్రం నిరాకరించాడం విశేషం.