తాగి ట్వీట్ పెట్టినందుకు 9 లక్షల నష్టం : కమెడియన్

ABN , First Publish Date - 2022-01-06T18:12:34+05:30 IST

‘ది కపిల్ శర్మ షో’తో ఈ షోకి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీనికి ప్రధాన కారణం ఆ షో హోస్ట్ కపిల్ శర్మ...

తాగి ట్వీట్ పెట్టినందుకు 9 లక్షల నష్టం : కమెడియన్

‘ది కపిల్ శర్మ షో’తో ఈ షోకి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీనికి ప్రధాన కారణం ఆ షో హోస్ట్ కపిల్ శర్మ. అందులో ఆయన వేసే పంచులు, చేసే కామెడీకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.


అయితే కపిల్ ఇప్పుడు స్టాండప్ కమెడియన్‌గా మారాడు. ఆయన కొత్త షో ‘కపిల్ శర్మ: ఐయామ్ నాట్ డన్ ఎట్’ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో టెలికాస్ట్ కానుంది. జనవరి 28న ప్రసారమయ్యే ఈ షోలో ఆయన్ని కొత్త అవతారంలో చూస్తారని చెబుతున్నాడు ఈ స్టార్ హోస్ట్.


తాజాగా ఈ షోకి సంబంధించి ప్రొమోని సోషల్ మీడియాలో విడుదల చేశాడు కపిల్. అందులో ఆయన జీవితంలో జరిగిన ఓ నష్టం గురించి వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను గత 25 సంవత్సరాలుగా ఈ పరిశ్రమలో, గత 15 ఏళ్లుగా టీవీలో ఉన్నాను. కానీ నేను ఎప్పుడు కామెడీని సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే పంజాబ్ నుంచి వచ్చిన వాళ్లకి జోక్స్ వేయడం మాములే. ఇలాంటి వాటికి డబ్బులు సంపాదించొచ్చని నాకు తెలియద’ని తెలిపాడు.


కపిల్ ఈ నెట్‌ఫ్లిక్స్ షో తన జీవితంలో జరిగిన కొన్ని సరదా సంఘటనలను తన స్టైల్‌లో సరదాగా వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఓ సారి మాల్దీవులకి వేకేషన్‌కి వెళ్లాను. అప్పుడు తాగిన మైకంలో పీఎం నరేంద్ర మోదీ గురించి ఓ ట్వీట్ పెట్టాను. అనంతరం భయంతో ఇక్కడ ఇంటర్నెట్ రాని రూమ్ ఉంద అని హోటల్ సిబ్బందిని అడిగా. వాళ్లు వెంటనే ‘మీకు పెళ్లయిందా?’ అని ప్రశ్నించగా.. ‘కాదు.. నేనో ట్వీట్ పెట్టాను’ అని తెలిపాన’ని చెప్పాడు.


అంతేకాకుండా.. ‘ఆ గది కోసం అక్కడ ఉన్న 8, 9 రోజుల్లో దాదాపు 9 లక్షలు ఖర్చు అయ్యింది. అంతా నా చదువు కోసం కూడా పెట్టలేద’ని సరదాగా వ్యాఖ్యానించాడు కపిల్. ఆ తాగి పెట్టిన ట్వీట్‌కి లక్షల్లో నష్టపోయానని, దాన్ని పట్టించుకోవద్దని అనంతరం నెటిజన్లను ఈ కమెడియన్ కోరాడు. కాగా, టీవీలో వీక్షకులని ఎంతో ఆకట్టుకున్న కపిల్.. ఓటీటీలో ఎంతవరకు సక్సెస్ అవుతాడో ఈ నెల చివరిలో తెలిసి పోతుంది. ఆ ఫన్నీ వీడియోని మీరు ఓసారి చూసేయండి..



Updated Date - 2022-01-06T18:12:34+05:30 IST