ఆ పాత్ర కోసం 20 కిలోల బరువు పెరిగిందట.. సోషల్ మీడియాలో కంగనా రనౌత్ కొత్త పోస్ట్
ABN , First Publish Date - 2022-02-09T22:03:22+05:30 IST
హీరోయిన్ ఓరియేంటెడ్ క్యారెక్టర్స్, కొత్త రకం పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన నటి కంగనా రనౌత్
హీరోయిన్ ఓరియేంటెడ్ క్యారెక్టర్స్, కొత్త రకం పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా మారిన నటి కంగనా రనౌత్. జయలతిత బయోపిక్ ‘‘తలైవి’’లో ఆమె నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అభిమానుల మన్ననలు పొందినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో వసూళ్లను సాధించలేదు.
జయలలితలా కనిపించడానికి కంగన కేవలం ఆరు నెలల్లోనే దాదాపుగా 20కిలోల బరువు పెరిగింది. ‘తలైవి’ సినిమా షూటింగ్లోని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆమె ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పిక్లో పుస్తకాన్ని పట్టుకుని ఆమె చదువుతోంది. ఆ ఫొటోకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘‘తలైవి రోజులను గుర్తు చేసుకుందాం. ఆ పాత్ర కోసం నేను 20కిలోలు పెరిగాను’’ అని కంగన తెలిపింది. ప్రస్తుతం కంగన ‘ధక్కడ్’, ‘తేజస్’ సినిమాల్లో నటిస్తోంది. నిర్మాతగా కూడా ఆమె మారింది. ‘టికు వెడ్స్ షేరు’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధీఖీ, అవనీత్ కౌర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.