Kangana Ranaut: ఇన్స్టాగ్రామ్ ఓ చెత్త.. వాటికి తప్ప ఎందుకు పనికిరాదు
ABN , First Publish Date - 2022-11-11T20:05:36+05:30 IST
బాలీవుడ్ (Bollywood)లోని టాప్ హీరోయిన్స్లో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఒకరు. ఎటువంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్గా ఎదిగింది..
బాలీవుడ్ (Bollywood)లోని టాప్ హీరోయిన్స్లో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఒకరు. ఎటువంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్గా ఎదిగింది. అంతేకాకుండా.. ఏ విషయం మీదైనా ఎటువంటి బెరుకు లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. సినిమాలతో కంటే వివిధ అంశాల మీద తనదైన స్టైల్లో స్పందిస్తూ వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటుంది. అయినా వెనక్కి తగ్గక్కుండా తనదైన స్టైల్లో దూసుకుపోతోంది. తాజాగా సైతం ఇన్స్టాగ్రామ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది.
కంగనా రనౌత్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీని షేర్ చేసింది. అందులో.. ‘ఇన్స్టాగ్రామ్ చిత్రాలకు మాత్రమే సంబంధించినది. ఎవరైనా ఏ అభిప్రాయం రాసినా మరుసటి రోజు అదృశ్యమవుతుంది. అందరూ చంచలమైన, పనికిమాలిన మూర్ఖులలాగే, ఇక్కడు ఎవరూ ఇంతకుముందు రాసిన వాటిని చూడటానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు చెప్పేది వారికే అర్థం కాదు. అందుకే అది కచ్చితంగా అదృశ్యమవ్వాలి.
అయితే మరి కొందరి సంగతి వేరు.. వారు చెప్పే ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారు. మనుషుల కోసం వారి ఆలోచనలను డాక్యుమెంట్ చేయాలనుకుంటున్నారు. వాటిని లోతుగా పరిశోధించడానికి ప్రయత్నిస్తారు. ఇవి మినీ బ్లాగులు. ఇవి సబ్జెక్ట్తో పాటు ఇతరులు ఉపయోగపడేలా ఉండాలి’ అని రాసుకొచ్చింది.
అయితే.. ట్విట్టర్ నిబంధనలను పదే పదే ఉల్లంఘించినందుకు కంగనా ట్విట్టర్ ఖాతాను 2021 మేలో ట్విట్టర్ శాశ్వతంగా నిలిపివేసింది. ఎలోన్ మస్క్ ట్విట్టర్ని టేకోవర్ చేసిన తర్వాత.. కంగనా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్కు తిరిగి రావడం గురించి మాట్లాడే పోస్ట్లను షేర్ చేస్తోంది. ట్విట్టర్లోకి తిరిగి రావాలని గట్టిగా కోరుకుంటుంది. అందుకే ఇన్స్టాగ్రామ్ ఫొటోలను షేర్ చేయడానికి తప్ప ఎందుకు పనికి రాదు అన్నట్లుగా స్టోరీలో రాసుకొచ్చింది.