Hrithik Roshanకి క్షమాపణలు చెప్పకపోతే.. నా పనైపోతుందని ఆ పాపులర్ రైటర్ బెదిరించాడు: Kangana Ranaut

ABN , First Publish Date - 2022-07-06T20:56:04+05:30 IST

కంగనా రనౌత్, హృతిక్ రోషన్‌ (Hrithik Roshan) ఈ జంట ప్రేమాయణం, తరువాత విడిపోవడం, అనంతరం ఒకరిపై..

Hrithik Roshanకి క్షమాపణలు చెప్పకపోతే.. నా పనైపోతుందని ఆ పాపులర్ రైటర్ బెదిరించాడు: Kangana Ranaut

కంగనా రనౌత్, హృతిక్ రోషన్‌ (Hrithik Roshan) ఈ జంట ప్రేమాయణం, తరువాత విడిపోవడం, అనంతరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అందరికీ తెలిసిందే. అదే తరుణంలో ప్రముఖ బాలీవుడ్ లిరిసిస్ట్ జావేద్ అఖ్తర్‌(Javed Akhtar)పై ఈ బ్యూటీ కామెంట్స్ చేసింది. దీంతో ఆ రచయిత ఈ భామపై పరువు నష్టం (Defamation case) దావా వేశాడు. దీనిపై కోర్టులో విచారణ సాగుతోంది. ఇందులో భాగంగా జులై 4న ముంబైలోని కోర్టులో ఈ కేసుకి సంబంధించి కంగన స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. 


ఆ స్టెట్మెంట్‌లో.. ‘మేము మోసగాళ్లను వాడుకోవడానికి భయపడం. అప్పుడు మీ వ్యవహారం హృతిక్‌తో కాదు, మోసగాళ్లతో అని ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు మీ పాపులారిటీకి ఇబ్బంది కలుగుతుంది. నీకు ఆత్మహత్య తప్ప మరో దారి ఉండదు. జనాల్లో విపరీతమైన అపకీర్తి వస్తుంది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాటినుంచి నువ్వు బయటపడాలంటే క్షమాపణలు చెప్పడమే దారి. కాబట్టి క్షమాపణలు చెప్పి, నిన్ను నువ్వు రక్షించుకో. మంచి కుటుంబానికి చెందిన అమ్మాయి అవమానంతో తలదించుకోవాల్సి వస్తుంది. నీకు కొంచెమైన సిగ్గుంటే గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించు. ఈ విషయంలో పట్టుదలగా ఉండొద్దు’ అని జావేద్ బెదిరించాడని కంగనా చెప్పుకొచ్చింది. కాగా.. జావేద్ అఖ్తర్ అంథేరీ మేజిస్ట్రేట్ కోర్టులో కంగనా రనౌత్‌పైపరువు నష్టం కేసు దాఖలు చేసి, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఆమెకి, హృతిక్ ఉన్న తగదాలను పరిష్కరించడానికి ప్రయత్నించానని, అందులో ఆమెని బెదిరించానని చెబుతూ పరువు తీస్తోందని అందులో పేర్కొన్నాడు.

Updated Date - 2022-07-06T20:56:04+05:30 IST