అలియా భట్ సినిమా కలెక్షన్లపై కంగనా రనౌత్ సెటైర్లు.. ఆమాత్రం ఉండాలిలే అంటూ..

ABN , First Publish Date - 2022-03-09T20:31:45+05:30 IST

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న అలియా భట్, కంగనా రనౌత్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే...

అలియా భట్ సినిమా కలెక్షన్లపై కంగనా రనౌత్ సెటైర్లు.. ఆమాత్రం ఉండాలిలే అంటూ..

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న అలియా భట్, కంగనా రనౌత్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. వరుసగా భారీ బడ్జెట్, లేడి ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఈ భామలు ఇద్దరికీ కోల్డ్ వార్ నడుస్తున్న విషయం విదితమే. అందుకే ఒకరిపై ఒకరు ఎప్పుడూ విమర్శలు చేసుకుంటూ ఉంటారు.


ఇటీవలే అలియా భట్ తాజా చిత్రం ‘గంగుభాయ్ కతియావాడి’పై విడుదలకి ముందే కంగన విమర్శలు చేసింది. దాదాపు 200 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు అవ్వనున్నాయని కంగన కామెంట్ చేయగా.. అలాంటి వాటిని నేను పట్టించుకోనని అలియా స్పందించింది. అయితే అలియా సినిమా విడుదలై 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయిందని నిర్మాతలు చెబుతున్నారు. ఈ తరుణంలో ఓ మ్యాగజైన్.. ‘అభిమానులు ఎంతో ఆసక్తిగా, ఆతృతగా ఎదురుచూసిన సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. ఈ మూవీ మంచి సక్సెస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. నిజమైన కలెక్షన్స్‌ని డబుల్ చేసి చూపిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం’ అంటూ రాసింది.


ఆ పోస్ట్‌ని కంగనా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి.. ‘పాలలో నీళ్లు కలిపితే పలుచగా అవుతాయని మనకు తెలుసు. కానీ ఇక్కడ పాలు కలిపి నీళ్లని పలుచగా చేస్తున్నారు. నిస్సహాయులకి ఆ మాత్రం సపోర్టు కావాలిలే’ అంటూ వ్యంగంగా క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఇప్పటికే ఓ రేంజ్‌లో మండుతున్న మంటల్లో పెట్రోల్ పోసినట్లైంది. ఈ విమర్శపై అలియా ఎలా స్పందిస్తుందో చూడాలి మరి..

Updated Date - 2022-03-09T20:31:45+05:30 IST