Bharatheeyudu 2: కాజల్ తిరుపతి పర్యటన వెనక అసలు కథ ఇదీ!
ABN , First Publish Date - 2022-09-27T19:17:48+05:30 IST
కమల్ హాసన్ (Kamal Haasan) మరియు దర్శకుడు శంకర్ (Director Shankar) కాంబినేషన్ లో వస్తున్న 'భారతీయుడు 2' (Bharatheeyudu 2) లో కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ షూటింగ్ (Shooting) ప్రస్తుతం తిరుపతి (Tirupati) పరిసరాల్లో జరుగుతోంది
కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) ఈమధ్య తిరుమల (Tirumala) తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామి (Lord Venkateswara) ని దర్శించుకున్నారు. ఆ ఫోటోస్ సాంఘీక మాధ్యమాల్లో వైరల్ (Viral) అయ్యాయి కూడా. అయితే కాజల్ అగర్వాల్ తిరుమల పర్యటన వెనక అసలు కథ (True story) ఇదే అంటున్నారు. కమల్ హాసన్ (Kamal Haasan) మరియు దర్శకుడు శంకర్ (Director Shankar) కాంబినేషన్ లో వస్తున్న 'భారతీయుడు 2' (Bharatheeyudu 2) లో కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా మళ్ళీ ప్రారంభం అయింది. అయితే ఈ షూటింగ్ (Shooting) ప్రస్తుతం తిరుపతి (Tirupati) పరిసరాల్లో జరుగుతోంది. ఆ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చిన కాజల్ ముందుగా తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామి ని దర్శించుకొని తరువాత షూటింగ్ కి వెళ్లారు.
తిరుపతి దగ్గర చంద్రగిరి (Chandragiri) అని చారిత్రక పట్టణం (Historic city) వుంది. ఆ చుట్టుపక్కల అంతా మంచి షూటింగ్ లొకేషన్స్ (Shooting locations) చాలా వున్నాయి. అక్కడ గుండాల కోన (Gundala Kona) అటవీ ప్రాంతంలో (Forest area) సోమవారం నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినట్టుగా తెలిసింది. చాలా కీలక సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించినట్టు తెలిసింది. ఇందులో కాజల్ అగర్వాల్, కమల్ హాసన్ ఇంకా మరికొంతమంది నటులు కూడా పాల్గొన్న సన్నివేశాలను దర్శకుడు శంకర్ చిత్రీకరించినట్టు తెలిసింది. చుట్టు పక్కల గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున ఈ షూటింగ్ ప్రదేశానికి చేరుకొని కమల్ హాసన్ ని, కాజల్ ని చూడటానికి విచ్చేసారు. ప్రజలను కట్టడి చేసేందుకు సినిమా యూనిట్ వాళ్ళు తమ ప్రైవేట్ సెక్యూరిటీ ని కూడా తెచుకున్నట్టు తెలిసింది. ఈ సినిమా లో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కూడా ఇంకో కథానాయికగా నటిస్తోంది.