రెండు రూపాయలకు కూడా పనికిరాని Kangana కు పద్మశ్రీ అవార్డా.. Kamaal R Khan వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-11-10T22:58:42+05:30 IST

సినీ విమర్శకుడైన కమల్ ఆర్.ఖాన్(కేఆర్‌కే) మరో సారి వార్తల్లో నిలిచాడు. పద్మ శ్రీ అవార్డు అందుకున్న కంగనా రనౌత్‌పై విమర్శల అస్త్రాన్ని ఎక్కు పెట్టాడు.

రెండు రూపాయలకు కూడా పనికిరాని Kangana కు పద్మశ్రీ అవార్డా.. Kamaal R Khan వివాదాస్పద వ్యాఖ్యలు

సినీ విమర్శకుడైన కమల్ ఆర్.ఖాన్(కేఆర్‌కే) మరో సారి వార్తల్లో నిలిచాడు.  పద్మ శ్రీ అవార్డు అందుకున్న కంగనా రనౌత్‌పై విమర్శల అస్త్రాన్ని ఎక్కు పెట్టాడు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో భాగంగా కంగనాను మెచ్చుకున్న కేఆర్‌కేనే ప్రస్తుతం ఆమెను విమర్శించడం గమనార్హం. 


కరణ్ జోహర్, అద్నాన్ సమీ, ఏక్తా కపూర్ లతో పాటు కంగనా రనౌత్‌కు కేంద్రప్రభుత్వం పద్మ అవార్డులను అందించింది. మొదట ఏక్తా కపూర్‌ను లక్ష్యంగా చేసుకున్న కేఆర్‌కే ప్రస్తుతం కంగనా రనౌత్‌పై విరుచుకు పడ్డాడు. ‘‘ గతంలో పద్మ అవార్డులకు చాలా విలువుండేది. అత్యంత గౌరవనీయులైన వ్యక్తులకు మాత్రమే వీటిని అందించేవారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అడల్ట్ కంటెంట్ తయారు చేస్తున్న నిర్మాతలకు కూడా అవార్డులను బహుకరిస్తుంది. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ఏ విధంగా నాశనం చేసిందనడానికి ఈ అవార్డులు సాక్ష్యంగా నిలుస్తాయి ’’ అని ఏక్తా కపూర్‌ను లక్ష్యంగా చేసుకుని కేఆర్‌కే ట్వీట్ చేశారు. 


‘‘ కంగనాకు పద్మశ్రీ అవార్డా ? ఆమె బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది. ముస్లింలను అసహ్యించుకుంటుంది. సొంత అవసరాల కోసం ఎటువంటి నాటకమైనా ఆడుతుంది. ప్రతి ఒక్కరి దృష్టి తన మీద నిలవాలని ఎవరినైనా తిడుతుంది. నిజం చెప్పాలంటే ఆమె నటనకు రూ. 2 కూడా ఇవ్వలేం. అలాంటిది బీజేపీ ప్రభుత్వం ఆమెకు ఏకంగా పద్మ శ్రీ అవార్డును బహూకరించింది ’’ అని ట్విట్టర్‌లో ఆయన పోస్ట్ చేశాడు.

Updated Date - 2021-11-10T22:58:42+05:30 IST