ప్రేక్షకులను మెప్పించే పెళ్లి కథ
ABN , First Publish Date - 2022-12-10T06:21:46+05:30 IST
సంతోష్ శోభ న్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కల్యాణం కమనీయం’. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంతోష్ శోభ న్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కల్యాణం కమనీయం’. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లి నేపథ్యంలో సాగే ఆహ్లాదకర కథతో యూవీ కాన్సెప్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తెలుగులో తొలిసారి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిల్ కుమార్ ఆళ్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శుక్రవారం ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్, ఫస్ట్లుక్ను చిత్రబృందం విడుదల చేసింది. కుటుంబ ప్రేక్షకులను అలరించే పెళ్లికథ తో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్ భరద్వాజ్. సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని.