టికెట్స్ ఆన్‌లైన్‌లో అమ్మండి.. కానీ : ఏపీ ప్రభుత్వానికి దర్శకేంద్రుడి సూచన

ABN , First Publish Date - 2021-12-02T00:53:32+05:30 IST

‘ఒక హిట్ సినిమా ఎక్కువ షో స్ వేసుకున్నా.. మొదటివారం రేట్స్ పెంచుకోవడం వలన, తర్వాత కొన్ని మాములు సినిమాలు వచ్చినా థియేటర్ల యాజమాన్యం- వాళ్లని నమ్ముకున్న కొన్ని వేల మందికి 2, 3 నెలలకి సరిపడా ఆదాయం లభిస్తుంది..’ అని అన్నారు..

టికెట్స్ ఆన్‌లైన్‌లో అమ్మండి.. కానీ : ఏపీ ప్రభుత్వానికి దర్శకేంద్రుడి సూచన

‘ఒక హిట్ సినిమా ఎక్కువ షో స్ వేసుకున్నా.. మొదటివారం రేట్స్ పెంచుకోవడం వలన, తర్వాత కొన్ని మాములు సినిమాలు వచ్చినా థియేటర్ల యాజమాన్యం- వాళ్లని నమ్ముకున్న కొన్ని వేల మందికి 2, 3 నెలలకి సరిపడా ఆదాయం లభిస్తుంది..’ అని అన్నారు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. రీసెంట్‌గా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఆన్‌లైన్ టికెటింగ్, టికెట్ రేట్స్, నాలుగు ఆటలే.. నిర్ణయాలపై తొలిసారి రాఘవేంద్రరావు స్పందించారు. 45 సంవత్సరాల అనుభవంతో చెబుతున్నానంటూ.. సినిమా ఇండస్ట్రీకి ఉన్న సమస్యలను ఏపీ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఓ సుధీర్ఘ లేఖను ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అందులో.. 


‘‘45 సంవత్సరాల ఇండస్ట్రీలో దర్శకుడిగా, నిర్మాతగా నా అభిప్రాయాలు అర్థం చేసుకోండి. మనం ఎప్పుడూ మూలాల్ని మర్చిపోకూడదు. నేను ఈవాళ ఈ పొజిషన్‌లో ఉండటానికి కారణం ముందుగా ప్రేక్షకులు- థియేటర్ల యాజమాన్యం- డిస్ట్రిబ్యూటర్లు - నా నిర్మాతలు. వీళ్లందరూ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ప్రస్తుతం టిక్కెట్టు - షో స్ నిర్ణయంతో చాలా మంది తీవ్ర నష్టాలకు గురవుతారు. కామన్ మ్యాన్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా ఒక్కటే. ఒక గొప్ప అద్భుతమైన కథ కానీ, హృదయానికి హత్తుకునే కథ కానీ, సరదా సరదాగా చూసే సినిమా గానీ థియేటర్లలో అంటే పెద్ద స్ర్కీన్‌లలో డిటిఎస్-అట్మాస్- 3డి చూసిన అనుభూతి టీవీలో ఎట్టి పరిస్థితులలోనూ ఉండదు. షో స్ తగ్గించడం వలనగానీ, టిక్కెట్ల ధర తగ్గించడం వలన గానీ పైన చెప్పిన అందరూ నష్టపోతారు. ఒక హిట్ సినిమా ఎక్కువ షో స్ వేసుకున్నా మొదటివారం రేట్స్ పెంచుకోవడం వలన, తర్వాత కొన్ని మాములు సినిమాలు వచ్చినా థియేటర్ల యాజమాన్యం- వాళ్లని నమ్ముకున్న కొన్ని వేల మందికి 2, 3 నెలలకి సరిపడా ఆదాయం. ఎందుకంటే 100 సినిమాలలో 10 శాతం హిట్స్ కన్నా ఉండవు.. 10 శాతం యావరేజ్. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఆన్‌లైన్‌ వలన దోపిడి ఆగిపోతుంది అనడం కరెక్ట్ కాదు. ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూడాలనుకుంటే టికెట్ వెల 300 అయినా, 500 అయినా చూస్తాడు. ఒక రూపాయికే సినిమా చూపిస్తామన్నా అతనికి నచ్చని సినిమా చూడడు. పైగా ఆన్‌లైన్‌లో చాలా మంది ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నవాళ్లు బ్లాక్ చేసుకుని, వాళ్ల శిష్యుల ద్వారా బ్లాక్‌లో అమ్మవచ్చు. అదే రేట్లు పెంచి, ఆన్‌లైన్‌లో అమ్మితే థియేటర్ల వలన గవర్నమెంట్‌కి ఎక్కువ టాక్స్ వస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన న్యాయం చేకూర్చాలని ఆశిస్తున్నాను. 

మీ 

కె. రాఘవేంద్రరావు’’ అని దర్శకేంద్రుడు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.





Updated Date - 2021-12-02T00:53:32+05:30 IST