ఆ రోజు ఫోన్‌ మోగితే చాలు!

ABN , First Publish Date - 2022-09-27T06:15:24+05:30 IST

చిత్రసీమలో ఎవరి స్థానమూ శాశ్వతం కాదు. ప్రతీ శుక్రవారం ఇక్కడ జాతకాలు మారిపోతుంటాయి. స్టార్‌ డమ్‌, క్రేజ్‌, ఇమేజ్‌...

ఆ రోజు ఫోన్‌ మోగితే చాలు!

చిత్రసీమలో ఎవరి స్థానమూ శాశ్వతం కాదు. ప్రతీ శుక్రవారం ఇక్కడ జాతకాలు మారిపోతుంటాయి. స్టార్‌ డమ్‌, క్రేజ్‌, ఇమేజ్‌.. ఇవి రోజుకు ఒకలా ఉంటాయి. ఈ మార్పులూ, చేర్పులకు స్టార్లు కూడా సిద్ధంగా ఉండాలి. ఈ విషయం తనకు బాగా తెలుసని అంటోంది పూజా హెగ్డే. దక్షిణాదిన అగ్ర కథానాయికగా చలామణీ అవుతోంది పూజా హెగ్డే. బాలీవుడ్‌లోనూ తనకు అవకాశాలు వస్తున్నాయి. మిగిలిన వారితో పోలిస్తే పూజా పారితోషికం ఎక్కువే అని టాక్‌.


‘‘నా అదృష్టం కొద్దీ చిత్రసీమలోకి వచ్చాను. ఇక్కడ నా ప్రతిభతోనే నిలదొక్కుకొన్నా. హిట్లూ, ఫ్లాపులూ ఎప్పుడు తలుపు తడతాయో ఎవరూ చెప్పలేరు. బాగా ఆడుతుందనుకొన్న సినిమా బోల్తా కొట్టొచ్చు. అంచనాలు లేని సినిమాలు బాగా ఆడొచ్చు. దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఎంత కష్టపడినా సినిమా హిట్టయితేనే జనం మన గురించి మాట్లాడుకొంటారు. ఫ్లాప్‌ అయితే... అస్సలు పట్టించుకోరు. కనీసం ఆ రోజు స్నేహితుల నుంచి ఫోన్లు కూడా రావు. పరిశ్రమ సంగతి సరేసరి. అదే హిట్టు పడిందనుకోండి... లెక్కలేనన్ని కాల్స్‌ వస్తుంటాయి. అందరికీ ఇలానే జరుగుతుంది. నేనేం మినహాయింపు కాదు. హిట్టుకి ఇచ్చే విలువ దేనికీ ఇవ్వరు. ఈ నిజం నాకు తొందరగానే అర్థమైంది. అందుకే నా సినిమా రిలీజ్‌ అవుతోందంటే కాస్త కంగారుగా ఉంటుంది. ఆ రోజు నా ఫోన్‌ మోగిందంటే జాతకం బాగున్నట్టే’’ అని చెప్పుకొచ్చింది. 


Updated Date - 2022-09-27T06:15:24+05:30 IST