మావయ్యా.. మీరు, లోకేష్ త్వరగా కోలుకోవాలి: తారక్

ABN , First Publish Date - 2022-01-19T00:38:38+05:30 IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్.. ఇద్దరూ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయం వారే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ విషయం తెలిసిన వారంతా చంద్రబాబు, లోకేష్

మావయ్యా.. మీరు, లోకేష్ త్వరగా కోలుకోవాలి: తారక్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్.. ఇద్దరూ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయం వారే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ విషయం తెలిసిన వారంతా చంద్రబాబు, లోకేష్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి వంటి వారంతా.. వారు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్స్ చేశారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, లోకేష్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు.


‘‘మావయ్య చంద్రబాబు నాయుడుగారు మరియు లోకేష్.. కరోనా బారి నుండి త్వరగా కోలుకోవాలి. త్వరలోనే పూర్తి ఆరోగ్యవంతులుగా తిరిగిరావాలని కోరుతున్నాను..’’ అని ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, అంతకుముందు ఎన్టీఆర్ కరోనా బారిన పడినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా.. ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ ట్వీట్‌‌కి ఆ ట్వీట్‌ని జతచేస్తూ.. ‘మనమంతా ఒకటే’ అంటూ నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



Updated Date - 2022-01-19T00:38:38+05:30 IST