రక్తంతో తడిసిన మట్టికే ఆ అర్హత!

ABN , First Publish Date - 2022-05-21T05:30:00+05:30 IST

‘కేజీఎఫ్‌’ రెండు భాగాలతోనూ అదరగొట్టారు ప్రశాంత్‌ నీల్‌. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్‌’ తీస్తున్నారు.

రక్తంతో తడిసిన మట్టికే ఆ అర్హత!

‘కేజీఎఫ్‌’ రెండు భాగాలతోనూ అదరగొట్టారు ప్రశాంత్‌ నీల్‌. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్‌’ తీస్తున్నారు. ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ కాంబో ఓకే అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శుక్రవారం ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ కాంబోకి సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చేసింది. అంతేకాదు... ఎన్టీఆర్‌ ఫస్ట్‌ లుక్‌ తో పాటు, ఓ పవర్‌ ఫుల్‌ డైలాగు సైతం ప్రోమోగా వదిలారు. ‘‘రక్తంతో తడిసిన మట్టికి మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయే అర్హత ఉంటుంది. అతని మట్టి.. అతని పాలన. కానీ అతని రక్తం మాత్రం కాదు’’ అనే డైలాగ్‌ ప్రోమోలో వినిపించింది. ‘‘20 ఏళ్ల క్రితం నా మనసులో పడ్డ ఆలోచనకు ప్రతి రూపమే ఈ సినిమా. ఎన్నాళ్లగానో నా మనసులో పదిల పరచుకున్న డ్రీమ్‌ ప్రాజెక్ట్‌నీ, నా డ్రీమ్‌ హీరోతో చేయడం చాలా ఆనందంగా ఉంద’’ని ప్రశాంత్‌ నీల్‌ చెప్పారు. మైత్రీ మూవీస్‌తో కలిసి ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2023 ఏప్రిల్‌ లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది. 

Updated Date - 2022-05-21T05:30:00+05:30 IST