మా పరువు తీయాలని చూస్తే ఊరుకోం: జీవిత

ABN , First Publish Date - 2022-04-23T20:20:40+05:30 IST

‘గరుడ వేగ’ సినిమా విషయంలో జీవితా రాజశేఖర్‌ తమను మోసం చేశారని జోస్టార్స్‌ ప్రొడక్షన్స్‌కు చెందిన కోటేశ్వరరాజు, హేమ శుక్రవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా జీవిత స్పందించారు. శనివారం ఏర్పాటు చేసిన ‘శేఖర్‌’ సినిమా ప్రెస్‌మీట్‌లో జీవిత మాట్లాడుతూ ‘‘మాపై వచ్చిన ఆరోపణల కేసు ప్రాపెసింగ్‌లో ఉంది.

మా పరువు తీయాలని చూస్తే ఊరుకోం: జీవిత

‘గరుడ వేగ’ సినిమా విషయంలో జీవితా రాజశేఖర్‌ తమను మోసం చేశారని జోస్టార్స్‌ ప్రొడక్షన్స్‌కు చెందిన కోటేశ్వరరాజు, హేమ శుక్రవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా జీవిత స్పందించారు. శనివారం ఏర్పాటు చేసిన ‘శేఖర్‌’ సినిమా ప్రెస్‌మీట్‌లో జీవిత మాట్లాడుతూ ‘‘మాపై వచ్చిన ఆరోపణల కేసు ప్రాపెసింగ్‌లో ఉంది. నగరి నుంచి సమన్లు వచ్చి రెండు నెలలు అవుతుంది. అవి మాకు అందకుండా చేశారు. రెండు నెలల తర్వాత ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో తెలియడం లేదు. కోటేశ్వరరాజు చేస్తోన్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదు. మేము ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు ఉంటే ఒప్పుకుంటా. లేదంటే దేవుణ్ణి కూడా ధైర్యంగా నిలదీస్తా. మాపై ఆరోపణలు చేసినవారు ఉత్తములు కాదు. వాళ్ల వల్ల మా మేనేజర్‌తోపాటు చాలామంది ఇబ్బందులు పడ్డారు. కోర్టులో కేసు నడుస్తోంది. ఏది నిజమో కోర్టు చెబుతుంది. కాబట్టి నేను పెద్దగా ఈ విషయం గురించి మాట్లాడదలచుకోలేదు. మా పరువు  తీయాలని చూస్తే ఊరుకోం. ఈ విషయంలో దేనినైనా ఎదుర్కొవడానికి రెడీగా ఉన్నా’’ అని జీవిత పేర్కొన్నారు. 


Updated Date - 2022-04-23T20:20:40+05:30 IST