Munugodu bypoll: మునుగోడు లో జీవిత రాజశేఖర్ ప్రచారం

ABN , First Publish Date - 2022-10-07T20:16:32+05:30 IST

ఎలక్షన్ కమిషన్ మునుగోడు (Munugodu) ఉప ఎన్నికకు (Bypoll) సంబంధించి నవంబర్ 3వ తేదీ నాడు ఎన్నికలు జరుగుతాయని ప్రకటన చేసిన దగ్గర నుండి తెలంగాణా లోని అన్ని పార్టీలు ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గం మీద దృష్టి పెట్టారు.

Munugodu bypoll: మునుగోడు లో జీవిత రాజశేఖర్ ప్రచారం

ఎలక్షన్ కమిషన్ మునుగోడు (Munugodu) ఉప ఎన్నికకు (Bypoll) సంబంధించి నవంబర్ 3వ తేదీ నాడు ఎన్నికలు జరుగుతాయని ప్రకటన చేసిన దగ్గర నుండి తెలంగాణా లోని అన్ని పార్టీలు ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గం మీద దృష్టి పెట్టారు. అలాగే అన్ని పార్టీలు ఈ నియోజకవర్గ ఫలితాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ (BJP) కూడా ఎలా అయినా ఇక్కడ గెలవాలని తన పావులను కదుపుతోంది. అందుకోసం సినిమా నటుల సహాయ సహకారాలను కూడా తీసుకుంటోంది. ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత అయిన జీవిత రాజశేఖర్ (Jeevitha Rajasekhar) మునుగోడు (Munugodu) లో భా జ పా తరపున ప్రచారం (Election campaign) చేస్తారని తెలిసింది. ఆమె అందుకోసం సన్నద్ధం కూడా అవుతున్నట్టు సమాచారం. ఈటెల రాజేందర్, (Etela Rajender) జీవిత కి ఫోన్ చేసి మునుగోడు లో ప్రచారం చెయ్యాల్సిందిగా  ఆహ్వానించినప్పుడు, జీవిత తప్పకుండ చేస్తాను అని చెప్పారు అని తెలిసింది. ఈటెల భార్య, జీవిత రాజశేఖర్ తో కలిసి మునుగోడులో విస్తృత ప్రచారం చేస్తారని తెలిసింది. 


ఈ కార్యక్రమం ఇంకో రెండు రోజులల్లో ఖరారు అయ్యేట్టు ఉందని కూడా తెలిసింది. జీవిత రాజశేఖర్ భారతీయ జనతా పార్టీ తరపున ఈ వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో తెలంగాణ నుండి కానీ, ఆంధ్ర నుండి కానీ పోటీ చేస్తారనే ఊహా గణాలు చాల వున్నాయి. ఆలా ఎక్కడయినా సీట్ ఇస్తేనే ఆమె పార్టీ కి ప్రచారం చేస్తానని కూడా ఎప్పుడో చెప్పారు. అందువల్ల ఆమె ప్రాముఖ్యం ఇప్పుడు పార్టీలో బాగా పెరిగింది. దానికి తోడు జీవిత మంచి వక్త కూడా, బాగా మాట్లాడటం లో అండ్ వేసిన చెయ్యి. అందుకని జీవిత రాజశేఖర్ ని మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చెయ్యమని పార్టీ అభ్యర్ధించినట్టు తెలుస్తోంది. ఈసారి ఎలా అయినా గెలవాలని భా జ పా సర్వ శక్తులూ మునుగోడు మీద కేంద్రీకరిస్తోంది. 

సురేష్ కవిరాయని 

Updated Date - 2022-10-07T20:16:32+05:30 IST