రెండో పెళ్లి చేసుకోబోతున్న ‘జీన్స్’ హీరో..?

ABN , First Publish Date - 2022-03-22T01:27:08+05:30 IST

నిర్మాత త్యాగరాజన్ కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన

రెండో పెళ్లి చేసుకోబోతున్న ‘జీన్స్’ హీరో..?

నిర్మాత త్యాగరాజన్ కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు ప్రశాంత్. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ‘జీన్స్’ చిత్రంలో అతడు హీరోగా నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. కోలీవుడ్‌లో అజిత్, విజయ్‌లతో సమానంగా అతడికి క్రేజ్ ఉండేదనడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు. ‘దొంగ, దొంగ’, ‘జోడీ’ వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించాడు. ప్రస్తుతం ప్రశాంత్ ‘అంధగన్’ సినిమాలో నటిస్తున్నాడు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ హిట్ చిత్రం ‘అంధాధున్’కి రీమేకిదీ. ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ ‘అంధగన్’ కు దర్శకత్వం వహించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


తాజాగా ప్రశాంత్‌కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అతడు త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. ‘అంధగన్’ విడుదలైన నెల రోజుల తర్వాత ఈ వివరాలను అతడు అధికారికంగా వెల్లడిస్తాడని కోలీవుడ్‌లో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ ఏడాది చివరలో అతడి పెళ్లి జరగబోతుందని సమాచారం. ప్రశాంత్‌కు 2005లోనే వివాహం అయింది. బిజినెస్ మ్యాన్ కూతురు అయిన గృహలక్ష్మీతో అతడు ఏడడుగులు వేశాడు. ఈ దంపతులకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఈ జంట మనస్పర్థల వల్ల 2008లో విడాకులు తీసుకున్నారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ లోను ప్రశాంత్ నటించాడు. 

Updated Date - 2022-03-22T01:27:08+05:30 IST