Janhvi Kapoor: లైక్స్ వస్తే.. ఈఎంఐలు కట్టగలుగుతా
ABN , First Publish Date - 2022-11-08T19:38:50+05:30 IST
బాలీవుడ్లో మంచి పాపులారిటీ ఉన్న నటీమణుల్లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ఒకరు. శ్రీదేవి వారసురాలిగా చిత్ర పరిశ్రమకి పరిచయమైన..
బాలీవుడ్లో మంచి పాపులారిటీ ఉన్న నటీమణుల్లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ఒకరు. శ్రీదేవి వారసురాలిగా చిత్ర పరిశ్రమకి పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు వేయించుకుంది. అనంతరం లేడీ ఓరియెంటెడ్, ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ అందరికీ పక్కింటి అమ్మాయిగా మారిపోయింది. ఈ బ్యూటీ తాజాగా నటించిన చిత్రం ‘మిలీ’(Mili). నవంబర్ 4న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్తో దూసుకుపోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా జాన్వీ మాట్లాడుతూ సోషల్ మీడియాలో హాట్ పిక్స్పై స్పందించింది.
జాన్వీ మాట్లాడుతూ.. ‘మీరు చేస్తున్న సినిమాలు ఒకలాగా ఉంటాయి. అలాగే మీ సోషల్ మీడియాలో షేర్ చేసే పిక్స్ అందుకు విరుద్ధంగా ఉంటాయి. బయట ఇలా మోడ్రన్గా చూసిన ప్రేక్షకులు మూవీస్లో సాధారణ, సంప్రదాయ అమ్మాయి పాత్రల్లో చూడటానికి ఇబ్బంది పడతారని.. పలు రకాల మాటలు నా గురించి వింటున్నాను. కానీ ఎవరి అంచనాలకు అందడం నాకు నచ్చదు. అందుకే కొత్తగా ప్రయత్నిస్తుంటాను. కొందరికీ నన్ను ఓ వైపు మనీష్ మల్హోత్రా చీరలో.. అలాగే మరో వైపు సినిమాలో కుర్తాలో చూడడం నచ్చకపోవచ్చు. కానీ అది నా పని, నా కళని నేను చూపిస్తున్నాను. నేను నిజ జీవితంలో నేను అలా ఉండను. ఓ యాక్టర్కి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం అదే’ అని చెప్పుకొచ్చింది.
అలాగే సోషల్ మీడియా (Social media) పిక్స్ గురించి మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియా నాకు సరదాగా ఉండటానికి ఉపయోగపడుతుంది. నేను క్యూట్గా కనిపిస్తే ఐదుగురు అదనంగా నా పిక్స్కి లైక్ కొడతారు. దాని వల్ల నాకు కొత్తగా మరో బ్రాండ్ అడ్వార్టైజ్మెంట్ వస్తుంది. దాని వల్ల నా ఈఎంఐలను సులభంగా కట్టగలుగుతాను’ అని జాన్వీ తెలిపింది.
కాగా.. జాన్వీ తాజా చిత్రం ‘మిలీ’ మలయాళ చిత్రం ‘హెలెన్’కి రిమేక్. సర్వైవల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఓరిజినల్ మూవీకి దర్శకత్వం వహించిన మతుకుట్టి క్జావియర్నే దర్శకుడు. జాన్వీ తండ్రి బోనీ కపూర్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. జాన్వీ ప్రస్తుతం రాజ్ కుమార్ రావు సరసన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’, వరుణ్ ధావన్ సరసన ‘భేడియా’లో నటిస్తోంది.