Janhvi Kapoor: మీ అమ్మ ఎలా ఉండేది.. నువ్వు ఎలా ఉన్నావు.. జూనియర్ శ్రీదేవిని ఆడేసుకుంటున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2022-07-29T15:28:06+05:30 IST

అందాల తార శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ జాన్వీ కపూర్. మొదటి సినిమా..

Janhvi Kapoor: మీ అమ్మ ఎలా ఉండేది.. నువ్వు ఎలా ఉన్నావు.. జూనియర్ శ్రీదేవిని ఆడేసుకుంటున్న నెటిజన్లు

అందాల తార శ్రీదేవి (Sridevi), నిర్మాత బోనీ కపూర్ వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). మొదటి సినిమా ‘ధడక్‌‌‌‌’తోనే సూపర్ హిట్ అందుకున్న ఈ భామ.. అనంతరం వరుసగా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ అందంతోపాటు అభినయంతో అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. అయితే తన డ్రెస్సింగ్, ప్రవర్తన వంటి పలు కారణాల వల్ల కొన్నిసార్లు విమర్శల పాలవుతూ ఉంటుంది. తాజాగా సైతం జాన్వీ ట్రోలింగ్‌కి గురైంది.


వరుస సినిమాలతో దూసుకుపోతున్న జాన్వీ తాజాగా నటించిన చిత్రం ‘గుడ్‌లక్ జెర్రీ (GoodLuck Jerry)’. జులై 29న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. దీంతో గత కొన్ని వారాలుగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో జాన్వీ బీజీగా గడుపుతోంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన నట జీవితం గురించి పలు కామెంట్స్ చేసింది. జాన్వీ మాట్లాడుతూ.. ‘నేను బాగా అలసిపోయాను. నేను ఈ ఇంటర్వ్యూ ఎలా చేస్తానో నాకు తెలియదు. షూటింగ్ పూర్తి చేశాను.. నేను ఫ్లైట్‌లో బుక్ చేసుకున్నాను. నా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. రాత్రంతా నిద్ర పట్టలేదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. నాకు నిద్ర వస్తోంది. కానీ నేను ఫిట్‌గా కనిపించాలి కాబట్టి జిమ్‌కి వెళ్లాను. అక్కడ ఏం చేశానో నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ కూడా నాకు చాలా నిద్ర వచ్చింది. అందుకే ఈ ఇంటర్వ్యూలో ఏం చెబుతున్నానో కూడా నాకు తెలియదు. ఇదంతా ఎందుకు చేయాలో నాకు తెలియట్లేదు’ అని చెప్పుకొచ్చింది.






అయితే.. జాన్వీ చెప్పిన విధానంగానీ, చెబుతున్నప్పుడు ఫుడ్ తినడం చాలా మందికి నచ్చలేదు. దీంతో ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘శ్రీదేవి నీ కన్నా పది రెట్లు పని చేసింది. రోజుల 20 గంటలు అయిన ఆమె ప్రవర్తన ఎంత బావుంటుంది. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు. నువ్వు మీ ఫ్యామిలీ నుంచే నేర్చుకోవాలి’ అని ఒకరు.. ‘కష్టపడకుండా వస్తే ఇలాగే ఉంటుంది. అందుకే నేపో కిడ్స్ నాకు నచ్చరు’ అంటూ మరొకరు.. ‘ఈమెని మరో 20 సంవత్సరాలు భరించాలా’ అంటూ ఇంకొకరు కామెంట్ చేయగా.. దానికి రిప్లైగా ‘ఆమె అంతకుముందే ఐటమ్ సాంగ్స్ చేసి రిటైరై పోతుంది’ అంటూ దారుణంగా రాసుకొచ్చారు. కాగా.. జాన్వీ ప్రస్తుతం రాజ్‌కుమార్ రావుతో కలిసి ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ అనే సినిమా చేస్తోంది. అలాగే మరికొన్నిప్రాజెక్టులు సైతం జాన్వీ చేతిలో ఉన్నాయి.



Updated Date - 2022-07-29T15:28:06+05:30 IST