Janhvi Kapoor: అప్పట్లో నేను ఎందుకు పనికిరానని ఫీలయ్యా.. కానీ..

ABN , First Publish Date - 2022-08-03T16:29:01+05:30 IST

బాలీవుడ్ పాపులర్ దర్శక నిర్మాత కరణ్‌జోహార్ దర్శకత్వం వహించిన ‘ధడక్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి జాన్వీ కపూర్...

Janhvi Kapoor: అప్పట్లో నేను ఎందుకు పనికిరానని ఫీలయ్యా.. కానీ..

బాలీవుడ్ పాపులర్ దర్శక నిర్మాత కరణ్‌జోహార్ దర్శకత్వం వహించిన ‘ధడక్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor). దివంగత అందాల తార శ్రీదేవి (Sridevi) వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ అందంతోపాటు అభినయంతో ఆకట్టుకుంటోంది. వరుసగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది. ఈ భామ తాజాగా నటించిన చిత్రం ‘గుడ్‌లక్ జెర్రీ’. 2018లో నయనతార నటించిన తమిళ హిట్‌ చిత్రం ‘కోలమావు కోకిల’కి ఇది రిమేక్. ఈ చిత్రం ఇటీవలే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. అందులో జాన్వీ నటనకి సైతం మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ.. తన సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.


జాన్వీ మాట్లాడుతూ.. ‘ధడక్(Dhadak), గుంజన్ సక్సేనా (Gunjan Saxena) సమయంలో.. ప్రతిదీ నాకు చాలా ఈజీగా అందాయి. నాకు అర్హత లేకుండా ఆ సినిమాలు నా దగ్గరకి వచ్చాయని ఫీల్ అయ్యాను. అంటే నాకు సాంకేతికంగా విలువ లేదు. నా తల్లిదండ్రులు వల్లే నాకు అవకాశాలు లభిస్తున్నాయని చాలాసార్లు అనుకున్నా’ అని B4U పోడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చింది.


జాన్వీ ఇంకా మాట్లాడుతూ.. ‘అదే సమయంలో.. నాకు మా తల్లిదండ్రుల పట్ల అపారమైన గౌరవం, ప్రేమ ఉన్నాయి. ఎందుకంటే.. వారి వల్లే నాకు అవకాశాలు వస్తున్నాయి. కానీ ఇక్కడ మరో నిజం ఏమిటంటే నేను నటనను ప్రేమిస్తున్నాను. దాని కోసమే జీవిస్తున్నాను. నేను నా పని చేస్తున్నాను. నా తల్లిదండ్రుల ప్రేమకి, వారి వల్ల నాకు అందుతున్న అవకాశాలకి నేను ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. అలాగే.. నా పనిని సైతం ఎంజాయ్ చేయాలని మాత్రం అనుకుంటున్నాను’ అని తెలిపింది. కాగా.. జాన్వీ ప్రస్తుతం రాజ్‌కుమార్ రావుతో కలిసి ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’, సన్నీ కౌశల్‌తో కలిసి మలయాళ చిత్రం ‘హెలెన్‌’కి రీమేక్‌‌గా తెరకెక్కుతున్న ‘మిలీ’, వరుణ్ ధావన్‌తో కలిసి ‘బవాల్’ చిత్రాలు చేస్తూ కెరీర్‌లో చాలా బిజీగా ఉంది.

Updated Date - 2022-08-03T16:29:01+05:30 IST