Janhvi Kapoor: ఖాన్ త్రయానికి జంటగా నటించడం విచిత్రంగా ఉంటుంది.. కానీ..
ABN , First Publish Date - 2022-08-02T23:37:58+05:30 IST
అందాల తార శ్రీదేవి (Sridevi), నిర్మాత బోనీ కపూర్ వారసురాలిగా బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor).
అందాల తార శ్రీదేవి (Sridevi), నిర్మాత బోనీ కపూర్ వారసురాలిగా బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor). మొదటి సినిమా ‘దఢక్’తోనే మంచి హిట్ అందుకున్న ఈ భామ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అనంతరం కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ అందంతోపాటు అభినయంతో అందరి హృదయాలను ఆకట్టుకుంటోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా నటించిన చిత్రం ‘గుడ్లక్ జెర్రీ(GoodLuck Jerry)’. 2018లో నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హిట్ చిత్రం ‘కొలమావు కోకిల(తెలుగులో కోకో కోకిల)’కి రీమేక్గా తెరకెక్కుతోంది.
కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ బ్యానర్లో దర్శకనిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించాడు. ఇటీవలే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదలైన ఈ మూవీ ‘గుడ్లక్ జెర్రీ’ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
జాన్వీ మాట్లాడుతూ.. ‘ఈ మూవీ అందరి నచ్చింది. అది రిమేక్లో నటించడం వల్ల వచ్చే లాభం. జనాలు చాలా సులువుగా కనెక్ట్ అయిపోయారు. అందువల్ల ఆడుతుందో లేదోననే భయం ఉండదు. అలాగే.. ఈ మూవీ మాతృకని ఇప్పటికే కొందరూ చూసి ఉంటారు. అలాంటి వాళ్లు ఆ సినిమాతో ఈ మూవీని కంపేర్ చేస్తారు. ఆ విషయం ముందే తెలుసు కానీ ఇది ఎంతో సరదా మూవీ. అందుకే రిమేక్పై అంత ధైర్యంగా ముందుకు వెళ్లాం. అలాగే సినిమాని మా స్టైల్లో చూపించాం’ అని జాన్వీ చెప్పుకొచ్చింది. అలాగే.. తెర మీద మీకు జోడిగా ఏ నటుడు అందంగా ఉంటారు అని అడగగా.. ‘వరుణ్ ధావన్ చాలా బావుంటాడు’ అని ఈ భామ తెలిపింది.
బాలీవుడ్లోని సూపర్స్టార్స్లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ టాప్లో ఉంటారు. వీరిని అభిమానులు ‘ఖాన్ త్రయం’ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ ఖాన్ త్రయానికి జోడిగా నటించడంపై జాన్వీ మాట్లాడుతూ.. ‘ఆ ముగ్గురు సూపర్స్టార్స్. వారితో కలిసి పని చేయాలని అందరూ కోరుకుంటారు. కానీ.. వాళ్ల పక్కన జోడిగా నటించాలంటే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. కొంచెం ఇబ్బంది పడతాను. అయినా వారితో కలిసి సినిమా చేయడం అంటే చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చింది. కాగా.. జాన్వీ ప్రస్తుతం రాజ్కుమార్ రావుతో కలిసి ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’, సన్నీ కౌశల్తో కలిసి మలయాళం చిత్రం ‘హెలెన్’కి రీమేక్గా తెరకెక్కుతున్న ‘మిలీ’, వరుణ్ ధావన్తో కలిసి ‘బవాల్’ చిత్రం చేస్తోంది.