లాస్ ఏంజిలిస్లో ఏంజాయ్ చేస్తున్న Janhvi Kapoor
ABN , First Publish Date - 2021-11-20T22:56:50+05:30 IST
శ్రీదేవి కూతురిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినా విభిన్న రకాల పాత్రలు పోషిస్తూ తనను తాను నిరూపించుకున్న నటి జాన్వీ కపూర్
శ్రీదేవి కూతురిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినా విభిన్న రకాల పాత్రలు పోషిస్తూ తనను తాను నిరూపించుకున్న నటి జాన్వీ కపూర్. తాజాగా గుంజన్ సక్సేనా సినిమాలో నటించి అభిమానులను ఫిదా చేసింది. ప్రస్తుతం ఆమె లాస్ ఏంజిలిస్లో ఏంజాయ్ చేస్తోంది. ఆ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు ఆ ఫొటోలను విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు.
జాన్వీ కపూర్ తండ్రైన బోనీ కపూర్ తన పుట్టిన రోజు వేడుకలను ఈ మధ్యనే దుబాయ్లో జరుపుకున్నారు. ఈ సంబరాల్లో జాన్వీ కపూర్తో పాటు ఆమె సోదరి ఖుషి కపూర్ పాల్గొంది. అనంతరం ఆమె ఏంజాయ్ చేయడానికి లాస్ ఏంజిలిస్ వెళ్లింది. అక్కడ తన స్నేహితులతో తీసుకున్న ఫొటోలను ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. రెస్టారెంట్లో ఆహారాన్ని ఆస్వాదిస్తున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
ఆమె పోస్ట్ చేసిన ఫొటోలకు అనేక మంది బాలీవుడ్ సెలెబ్రిటీలు స్పందించారు. ‘‘ ఇట్స్ వరల్డ్ టూర్ ’’ అని అర్జున్ కపూర్ కామెంట్ చేశాడు. సెలెబ్రిటీ డిజైనర్ అయిన మనీశ్ మల్హోత్రా ఎమోజీలతో తన స్పందనను తెలిపాడు. ప్రస్తుతం ఆమె ‘‘గుడ్ లక్ జెర్రీ’’ అనే సినిమాలో నటిస్తోంది. సిద్దార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ ఎల్.రాయ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.