Etharkkum thunindhavan చిత్ర బృందానికి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్గా ఇచ్చి సర్ప్రైజ్ చేసిన హీరో Suriya
ABN , First Publish Date - 2021-11-15T21:13:12+05:30 IST
సినిమాల్లో నటించేవారు చిత్రబృందాలను అప్పుడప్పుడు బహుమతులతో ఆశ్చర్యపరుస్తుంటారు. ఈ మధ్యనే హృతిక్ రోషన్ ఒక సినిమా షూటింగ్ బృందానికి షూస్ గిఫ్ట్గా ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు.
సినిమాల్లో నటించేవారు చిత్రబృందాలను అప్పుడప్పుడు బహుమతులతో ఆశ్చర్యపరుస్తుంటారు. ఈ మధ్యనే హృతిక్ రోషన్ ఒక సినిమా షూటింగ్ బృందానికి షూస్ గిఫ్ట్గా ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి జరిగింది. సినిమా షూటింగ్కు ప్యాకప్ చెప్పే రోజు ఒక స్టార్ హీరో అందరికీ బంగారు కాయిన్లను గిఫ్ట్గా ఇచ్చాడు.
జై భీమ్ సినిమాతో సంచలన విజయాన్ని నమోదు చేసిన నటుడు సూర్య. ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్ (ఐఏమ్డీబీ )లో ఈ సినిమా అత్యధిక రేటింగ్ను సాధించి ప్రపంచవ్యాప్తంగా రికార్డు సృష్టించింది. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘‘ఈతర్కుమ్ తునింధవన్’’. పాండిరాజ్ దర్శకత్వం వహించాడు. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ముగిసిందని దర్శకుడు ప్రకటించాడు. సినిమాకు ప్యాకప్ చెప్పడంతో హీరో సూర్య చిత్ర బృందంలోని అందరికీ గోల్డ్ కాయిన్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు.
‘‘ సూర్య చిత్ర బృందంలోని అందరికీ గోల్డ్ కాయిన్స్ ఇచ్చిన మాట నిజమే. మూవీకి పనిచేసిన ఆర్టిస్ట్స్, టెక్నిషీయన్స్ ప్రతి ఒక్కరికీ వీటిని బహుమతిగా సూర్య అందజేశాడు. ఈ కాయిన్లు అన్ని ఒకే బరువు కలిగి ఉన్నాయి. డైరెక్షన్, సినిమాటోగ్రాఫీ డిపార్ట్మెంట్లో పనిచేసేవారికీ సావరీన్ కాయిన్లను గిఫ్ట్గా ఇచ్చాడు’’ అని సినిమాకు సంబంధించిన ఒక వ్యక్తి చెప్పాడు.
సూర్య 40వ చిత్రంగా ‘ఈతర్కుమ్ తునింధవన్’ తెరకెక్కుతోంది. గత ఏడాది జులైలో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది.