Jacqueline Fernandez: కలల రాకుమారుడైన సుకేశ్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్న అందాల భామ!

ABN , First Publish Date - 2022-09-18T20:56:17+05:30 IST

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్ర శేఖర్‌‌తో(Sukesh Chandrashekhar)

Jacqueline Fernandez: కలల రాకుమారుడైన సుకేశ్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్న అందాల భామ!

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్ర శేఖర్‌‌తో(Sukesh Chandrashekhar) జాక్వెలిన్ రిలేషన్‌షిప్ కొనసాగించిందనే ఆరోపణలను పోలీసులు ఆమెపై మోపారు. సుకేశ్ నుంచి విలువైన బాహుమతులు పొందిందని ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. ఒకానొక సమయంలో సుకేశ్‌ను బీ టౌన్ భామ పెళ్లి చేసుకోవాలనుకుందట. 


జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సుకేశ్ చంద్ర‌ శేఖర్ ఖరీదైన బాహుమతులు అందించాడని తెలుస్తోంది. డిజైనర్ బ్యాగ్స్, డ్రెస్సెస్, లిమిటెడ్ ఎడిషన్ పర్‌ఫ్యూమ్స్‌ను గిప్ట్‌లుగా ఇచ్చి ఆమెను బోల్తాకొట్టించాడు. శ్రీలంక సుందరి ఎక్కడి కైనా వెళ్లాలనుకుంటే ప్రైవేట్ జెట్‌లను అద్దెకు తీసుకున్నాడు. దీంతో జాక్వెలిన్ పూర్తిగా అతడి ఉచ్చులో చిక్కుకుంది. సుకేశ్‌ను తన కలల రాకుమారుడిగా సన్నిహిత మిత్రలు వద్ద అభివర్ణించింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది.  


సుకేశ్‌ ఆర్థిక మోసాలు అన్ని తెలిసినప్పటికి సన్నిహిత సంబంధాలను కొనసాగించిందనే ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఆమెపై మోపారు. జాక్వెలిన్‌ను ఆకట్టుకోవడానికి సుకేశ్ శత విధాలా ప్రయత్నించాడు. ఆమెపై భారీగా డబ్బును వెచ్చించాడు. దీంతో సుకేశ్‌కు ఆమె మానసికంగా దగ్గరయింది. అదే సమయంలో సుకేశ్ నేర చరిత్ర‌కు సంబంధించి ఓ పత్రికలో కథనం వచ్చింది. ఈ వార్తను చూసి జాక్వెలిన్ ఆశ్చర్యపోయింది. ఈ విషయాన్ని పింకీ ఇరానీ (Pinky Irani) వద్ద ప్రస్తావించగా.. ఆమె సమాధానాన్ని దాటేసేందుకు ప్రయత్నించింది. జాక్వెలిన్‌ను పరిచయం చేసినందుకు గాను పింకీ ఇరానీకి సుకేశ్ కోట్లాది రూపాయాలను చెల్లించాడు. ఈ కేసు విషయంలోనే జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఈడీ అదికారులు బుధవారం ఎనిమిది గంటలపాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా సుకేశ్‌తో ఆరు నెలల పాటు సన్నిహితంగా మెలిగానని జాక్వెలిన్ అంగీకరించింది. కానీ, అతడి ఆర్థిక మోసాల గురించి తనకేమి తెలియదని చెప్పింది. ఇక జాక్వెలిన్ కెరీర్ విషయానికి వస్తే.. ఈ కేసుతో ఆమె కెరీర్ తీవ్రంగా దెబ్బతిందింది. అవకాశాలు సన్నగిల్లాయి. చివరగా ‘విక్రాంత్ రాణ’ లో అతిథి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం ‘రామ్ సేతు’, ‘సర్కస్’ సినిమాల్లో నటిస్తుంది. రామ్ సేతు సినిమా దీపావళి సందర్భంగా థియేటర్స్‌లోకి రానుంది. ‘సర్కస్’ క్రిస్‌మస్ కానుకగా విడుదల కానుంది.    

Updated Date - 2022-09-18T20:56:17+05:30 IST