Itlu Maredumilli Prajaneekam pre teaser : యూనిట్ కష్టమంతా కనిపిస్తోంది !
ABN , First Publish Date - 2022-06-28T20:53:49+05:30 IST
‘మహర్షి (Maharshi), నాంది (Naandi)’ చిత్రాల సక్సెస్ అల్లరి నరేశ్ (Allari Naresh) కు మంచి ఊపునిచ్చింది. కొత్త తరహా పాత్రలు చేయాలన్న తపనను పెంచింది. ప్రస్తుతం తన కెరీర్కు మంచి పునాది వేసిన కామెడీ పాత్రల్ని తాత్కాలికంగా పక్కన పెట్టేశాడు నరేశ్.
‘మహర్షి (Maharshi), నాంది (Naandi)’ చిత్రాల సక్సెస్ అల్లరి నరేశ్ (Allari Naresh) కు మంచి ఊపునిచ్చింది. కొత్త తరహా పాత్రలు చేయాలన్న తపనను పెంచింది. ప్రస్తుతం తన కెరీర్కు మంచి పునాది వేసిన కామెడీ పాత్రల్ని తాత్కాలికంగా పక్కన పెట్టేశాడు నరేశ్. తాజాగా అల్లరి నరేశ్ నటిస్తున్న మరో వెరైటీ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (Itlu Maredumilli Prajaneekam). ఈ సినిమాతో రాజ్ మోహన్ (Raj Mohan) అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. హాస్యా మూవీస్ బ్యానర్ పై, జీ స్టూడియోస్ సమర్పణలో రాజేశ్ దండ, ఏఆర్ మోహన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మారేడుమిల్లి అడవుల్లో చిత్ర యూనిట్ షూటింగ్ చేస్తోంది. 55 రోజుల పాట ఈ సినిమా టీమ్ ఒక యుద్ధమే చేసిందని చెప్పాలి. దర్శకుడు, ఛాయాగ్రహకుడు ఎంతో రిస్క్ తీసుకొని షూట్ చేసిన తీరు ఆశ్చర్యపరుస్తోంది.
తాజాగా ఈ సినిమా నుంచి ప్రీటీజర్ ను విడుదల చేశారు నిర్మాతలు. ఆనంది (Aanandi) హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ప్రీటీజర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. రోప్స్ సహాయంతో కెమేరా మేన్ చెట్లమీద వేళాడిన తీరు షాకిస్తోంది. 250 మంది టీమ్.. ఈ సినిమా షూటింగ్ కోసం శ్రమించారు. 22 అత్యంత ప్రమాదరకరమైన లొకేషన్స్ లో సన్నివేశాల్ని చిత్రీకరించారు. దీనికోసం చిత్ర బృందం 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయడం ఆశ్చర్యమనిపించకమానదు. ప్రమాదమని తెలిసినా ఔట్ పుట్ కోసం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీమ్ ఎంతో రిస్క్ చేయడం విశేషంగా చెప్పాలి. ఈ సినిమాను టీజర్ ను జూన్ 30న విడుదల చేస్తున్నారు. మారేడుమిల్లి చుట్టుపక్కల గ్రామాల్లో మేజర్ పార్ట్ కంప్లీట్ అయినట్టు సమాచారం. మరి ఈ సినిమా అల్లరి నరేశ్ కు ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి.