మారేడుమిల్లి ప్రజల విన్నపం

ABN , First Publish Date - 2022-10-01T05:30:00+05:30 IST

‘అల్లరి’ నరేశ్‌ ఈమధ్య రూటు మార్చారు. భావోద్వేగ ప్రధాన కథల్ని ఎంచుకొంటున్నారు. ‘నాంది’తో ఆ మార్పు కనిపించింది.

మారేడుమిల్లి ప్రజల విన్నపం

‘అల్లరి’ నరేశ్‌ ఈమధ్య రూటు మార్చారు. భావోద్వేగ ప్రధాన కథల్ని ఎంచుకొంటున్నారు. ‘నాంది’తో ఆ మార్పు కనిపించింది. ఇప్పుడు ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం’ అంటూ మరో ప్రయత్నం చేస్తున్నారు. రాజేశ్‌ దండా నిర్మాత. ఎ.ఆర్‌.మోహన్‌ దర్శకత్వం వహించారు. నవంబరు 11న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘మారేడుమిల్లి నేపథ్యంలో జరిగే కథ ఇది. అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కారం కోసం వాళ్లేం చేశారు? అనే అంశాల చుట్టూ నడుస్తుంది. నరేశ్‌ ప్రభుత్వ అధికారిగా నటించారు. పతాక సన్నివేశాలు ఆలోచింపజేస్తాయ’’ని దర్శకుడు తెలిపారు. ఆనంది కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు. 

Updated Date - 2022-10-01T05:30:00+05:30 IST