Itlu Maredumilli Prajaneekam : షూటింగ్ పూర్తి !
ABN , First Publish Date - 2022-08-22T15:35:33+05:30 IST
అల్లరి నరేశ్ (Allari Naresh) తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (Itlu Maredumilli Prajaneekam). జీ స్టూడియోస్ (Zee Studios) సమర్పణలో, హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండు (Rajesh Dandu) నిర్మించిన ఈ సినిమాకి ఏఆర్ మోహన్ (AR Mohan) దర్శకుడు.
అల్లరి నరేశ్ (Allari Naresh) తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (Itlu Maredumilli Prajaneekam). జీ స్టూడియోస్ (Zee Studios) సమర్పణలో, హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండు (Rajesh Dandu) నిర్మించిన ఈ సినిమాకి ఏఆర్ మోహన్ (AR Mohan) దర్శకుడు. ఆనంది (Anandi) కథానాయికగా నటిస్తుండగా.. సాయిచరణ్ పాకాల (Saicharan Pakala) సంగీతం అందిస్తున్నారు. మొన్నామధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మారేడుమిల్లి చుట్టు పక్కల గ్రామాల్లో ఎన్నికల అధికారి అయిన అల్లరి నరేశ్ బృందం.. ఎన్నికలు జరిపించడానికి బైలుదేరి వెళ్ళగా.. వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నే ఈ సినిమా ప్రధాన కథాంశం.
ఈ సినిమాలో బాలీవుడ్ ‘న్యూటన్’ (Nuton), మలయాళ ‘ఉండ’ (Unda) చిత్రాల పోలికలు కనిపిస్తాయి. అయితే సినిమా మాత్రం తెలుగు నేటివిటీకి తగ్గరీతిలోనే అద్భుతమైన ఎమోషన్స్ తో తెరకెక్కినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
అతి త్వరలో విడుదలకు సిద్దం కానున్న ఈ సినిమా అల్లరి నరేశ్ కెరీర్లో మరో ‘నాంది’ (Naandi) లాంటి సినిమా అవుతుందని చెబుతున్నారు మేకర్స్. మారేడుమిల్లి అడవుల్లో చిత్ర బృందం ఎంతో శ్రమకోర్చి షూటింగ్ పూర్తి చేశారు. ఆ క్రమంలో వారు ఎలాంటి కష్టాలు పడ్డారో గతంలో ఒక వీడియో రూపంలో తెలియజేశారు మేకర్స్. ఇక ఈ సినిమాపై టాలీవుడ్ లో మంచి పాజిటివ్ బజ్ నడుస్తోంది. ఔట్ పుట్ దర్శక, నిర్మాతలకు పూర్తి సంతృప్తినిచ్చిందని తెలుస్తోంది. కొంతకాలంగా కామెడీని పూర్తిగా పక్కన పెట్టి తనలోని నటుడ్ని వెలికి తీస్తున్న అల్లరి నరేశ్ .. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.