Karthikeya 2 : ఇస్కాన్ నుంచి చిత్రబృందానికి ఆహ్వానం

ABN , First Publish Date - 2022-07-19T13:31:29+05:30 IST

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ (Nikhil Siddhartha) తాజా చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). సూపర్ హిట్ ‘కార్తికేయ’ (Karthikeya) చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. చందుమొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ చిత్రం సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోంది

Karthikeya 2 : ఇస్కాన్ నుంచి చిత్రబృందానికి ఆహ్వానం

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ (Nikhil Siddhartha) తాజా చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). సూపర్ హిట్ ‘కార్తికేయ’ (Karthikeya) చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. చందుమొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ చిత్రం సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోంది. నిజానికి ఈ సినిమా ఈ నెల 22న విడుదల కావాలి. అయితే కొన్ని కారణాల వల్ల ఆగస్ట్ కు వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తారు నిర్మాతలు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా చిత్ర బృందానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులున్న ఇస్కాన్ (International Society of Krishna Consciousness) నుంచి ఆహ్వానం వచ్చింది. వవిత్ర క్షేత్రమైన బృందావన్‌లోని ఇస్కాన్ టెంపుల్‌లో ‘కార్తికేయ 2’ చిత్రానికి సంబంధించి అన్ని భాషల టీజర్స్ ను అక్కడ విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ సినిమా విడుదల తేదీని కూడా అక్కడే ప్రకటించబోతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఒక వీడియోలో హీరో నిఖిల్ ప్రకటించారు. 


ఈ సందర్భంగా ఇస్కాన్ టెంపుల్ వారి ఆహ్వాన పత్రాన్ని కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు నిఖిల్. ‘కార్తికేయ 2’ చిత్రానికి సంబంధించిన టీమ్‌ను పవిత్రక్షేత్రమైన బృందావన్‌కు సాదరంగా ఆహ్వానిస్తున్నాం.  శ్రీకృష్ణపరమాత్ముని జీవితం, మహిమను ఆవిష్కరించే కథ వెనుకనున్న వారి ప్రేరణ గురించి, ‘కార్తికేయ 2’ చిత్రానికి సంబంధించి వారి దృష్టికోణంలో శ్రీకృష్ణుని తత్వం గురించి వినాలని మా భక్తులు ఆసక్తిగా ఉన్నారు’.. అంటూ ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారామ్ దాస్ (Radharam Das) ఆహ్వాన పత్రాన్ని పంపించారు. గుజరాత్ లోని ద్వారక నగరం.. కొన్ని వేల ఏళ్ళ క్రితమే సముద్రగర్భంలో కలిసిపోయింది. దాని వెనకనున్న రహస్యాన్ని ఛేదించడానికి హీరో బృందం బైలు దేరుతుంది. ఇంతకీ ఆ రహస్యమేంటి? అన్నదే ‘కార్తికేయ 2’ కథాంశం. 


అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయికగా నటిస్తుండగా, శ్రీనివాసరెడ్డి, హర్ష చెముడు, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, తులసి, ప్రవీణ్, సత్య  ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి తనయుడు కాలభైరవ (Kalabhairava) సంగీతం అందిస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) చాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రస్తుతం ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. మొదటి భాగం సూపర్ హిట్ అవడంతో రెండో భాగంపై మరింత ఆసక్తిగా ఉన్నారు ప్రేక్షకులు. మరి ఈ సినిమా నిఖిల్ కు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి. 



Updated Date - 2022-07-19T13:31:29+05:30 IST