సుఖేశ్ చంద్రశేఖర్తో ఇంటిమేట్ ఫొటోపై స్పందించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్
ABN , First Publish Date - 2022-01-09T00:57:58+05:30 IST
ఆర్థిక మోసం కేసులో సఖేశ్ చంద్రశేఖర్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాన్ బాక్సీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్
ఆర్థిక మోసం కేసులో సఖేశ్ చంద్రశేఖర్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాన్ బాక్సీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగులకు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల నుంచి ఏకంగా రూ. 200కోట్ల మేర సుఖేశ్ మోసం చేశాడు. ప్రస్తుతం ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను సుఖేశ్ ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులోనే భాగంగా బాలీవుడ్ స్టార్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఈడీ విచారణను ఎదుర్కొంటుంది.
గతంలో సుఖేశ్తో ఆమె సన్నిహితంగా మెలిగిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. తాజాగా అటువంటి ఫొటో మరొకటి బయటికి వచ్చింది. ఆ ఫొటోలో జాక్వెలిన్ ముక్కు మీద సుఖేశ్ ముద్దు పెట్టుకున్నాడు. ఆ ఫొటో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ ఫొటోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. జాక్వెలిన్కు ఖరీదైన వస్తువులను సుఖేశ్ బాహుమతులుగా ఇచ్చారని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. ఒక హాలీవుడ్ సినిమాను చేస్తానని ఆమెకు హామీనిచ్చినట్టు పుకార్లు షికార్లు కొట్టాయి. సుఖేశ్ తిహార్ జైల్లో ఉన్నప్పుడు బాలీవుడ్కు చెందిన అనేక మంది అందగత్తెలు వచ్చేవారని సమాచారం.
ఈ పిక్ వైరల్గా మారడంతో సోషల్ మీడియాలో ఆమె స్పందించింది. ‘‘ ఈ దేశం నాకు ఎంతో గౌరవాన్ని ఇచ్చింది. మీడియా, నా స్నేహితుల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ప్రస్తుతం నా జీవితంలో కష్టతరమైన దశ కొనసాగుతుంది. నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఫొటోలను ప్రచురించవద్దు. మీకు ఇష్టమైన వ్యక్తుల గురించి ఆ విధంగా చేయరని భావిస్తున్నాను. మరోసారి మీరందరు ఆ విధంగా చేయరనుకుంటున్నాను. థ్యాంక్ యూ ’’ అని ట్విట్టర్లో జాక్వెలిన్ పోస్ట్ పెట్టింది.