ఓటీటీలోకి వచ్చేస్తున్న John Abraham సైన్స్ ఫిక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..?

ABN , First Publish Date - 2022-05-15T02:16:42+05:30 IST

బాలీవుడ్‌లో యాక్షన్ తరహా సినిమాలతో ఫేమ్ సంపాదించుకున్న నటుడు జాన్ అబ్రహాం(John Abraham). అతడు తాజాగా నటించిన చిత్రం ‘అటాక్: పార్ట్-1’ (Attack: Part 1). హై ఆక్టేన్ యాక్షన్, రొమాన్స్,

ఓటీటీలోకి వచ్చేస్తున్న John Abraham సైన్స్ ఫిక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..?

బాలీవుడ్‌లో యాక్షన్ తరహా సినిమాలతో ఫేమ్ సంపాదించుకున్న నటుడు జాన్ అబ్రహాం(John Abraham). అతడు తాజాగా నటించిన చిత్రం ‘అటాక్: పార్ట్-1’ (Attack: Part 1). హై ఆక్టేన్ యాక్షన్, రొమాన్స్, డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. లక్ష్య రాజ్ ఆనంద్ (Lakshya Raj Anand) దర్శకత్వం వహించాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez), రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) కీలక పాత్రలు పోషించారు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రాబోతుంది. 


‘అటాక్: పార్ట్-1’ మే 27నుంచి ఓటీటీ ప్లాట్‌ఫాం ‘జీ-5’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ‘జీ-5’ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. జాన్ అబ్రహాం ఈ సినిమాలో అర్జున్ షెర్గిల్ అనే  సైనికుడి పాత్రలో కనిపించాడు. తీవ్రవాదులు దాడి చేయడంతో పక్షపాతానికీ లోనవుతాడు. తన ప్రేమికురాలిని కూడా కొల్పోతాడు. ఆర్మీ ఓ కొత్త టెక్నాలజీని తీసుకువస్తుంది. ఆ సాంకేతికతో అతడు లేచి నిలబడగలుగుతాడు. పార్లమెంటు, ప్రధానిని ఉగ్రవాదుల దాడి నుంచి రక్షిస్తాడు. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ సందర్భంగా దర్శకుడు లక్ష్య రాజ్ ఆనంద్ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ పోస్ట్ చేశాడు. ‘‘ఓటీటీ ప్లాట్‌ఫాం ‘జీ-5’ మా సినిమా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతుంది. ఎన్నో ఒడుదొడుకులను తట్టుకుని భారత్ మొదటి సోల్జర్ చిత్రాన్ని నిర్మించాం. మేం చేసిన ప్రయత్నం డిజిటల్ ప్రీమియర్ ద్వారా మరికొంత మందికి చేరువ అవుతుందని అశిస్తున్నాం. ‘అటాక్’ కు సిద్దంగా ఉండండి’’ అని లక్ష్యరాజ్ ఆనంద్ పేర్కొన్నాడు. ఈ చిత్రాన్ని జయంతీలాల్ గడాకు చెందిన పెన్ స్టూడియోస్, జాన్ అబ్రహాం ‘జేఏ ఎంటర్‌టైన్‌మెంట్’, అజయ్ కపూర్ ప్రొడక్షన్స్ నిర్మించాయి.



Updated Date - 2022-05-15T02:16:42+05:30 IST