నిన్న ఖుష్బూ.. నేడు శరత్ కుమార్..
ABN , First Publish Date - 2022-02-03T02:22:49+05:30 IST
సెలెబ్రిటీలను కరోనా వదిలిపెట్టడం లేదు. ఒకరి తర్వాత మరొకరు కొవిడ్-19 బారిన పడుతున్నారు.
సెలెబ్రిటీలను కరోనా వదిలిపెట్టడం లేదు. ఒకరి తర్వాత మరొకరు కొవిడ్-19 బారిన పడుతున్నారు. విక్రమ్, కమల్ హాసన్, మహేశ్ బాబు, ఖుష్బూ తదితరులకు కొవిడ్ సోకిన సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్ స్టార్ శరత్ కుమార్కు కరోనాగా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అతడు తెలిపాడు. తనను కలిసిన వారందరు తప్పకుండా కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించాడు.
‘‘స్నేహితులు, సన్నిహితులకు గుడ్ ఈవినింగ్. ఈ రోజు సాయంత్రం నాకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నాను. గత వారం రోజులుగా నన్ను కలిసిన వారందరూ తప్పకుండా కరోనా పరీక్ష చేయించుకోవాలి’’ అని ట్విట్టర్లో తాజాగా అతడు వెల్లడించాడు. గతంలోనూ శరత్ కుమార్కు కరోనా సోకింది. గతేడాది డిసెంబరులో ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్ సమయంలో అతడు కరోనా బారినపడ్డాడు. దాని నుంచి కోలుకుని రెండు నెలలైనా గడవక ముందే అతడికి మరోసారి మహమ్మారి సోకింది.