Samrat Prithviraj ఫ్లాప్ అయితే ఏం చేస్తారనేది.. గతంలోనే చెప్పేసిన Akshay Kumar.. ఇంతకీ ఏమన్నాడంటే..
ABN , First Publish Date - 2022-06-15T22:45:53+05:30 IST
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) తాజాగా నటించిన సినిమా ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj). మిస్ యూనివర్స్-2017 టైటిల్ విజేత మానుషి చిల్లర్ (Manushi Chhillar)
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) తాజాగా నటించిన సినిమా ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj). మిస్ యూనివర్స్-2017 టైటిల్ విజేత మానుషి చిల్లర్ (Manushi Chhillar) హీరోయిన్గా నటించింది. చంద్ర ప్రకాష్ ద్వివేది (Chandraprakash Dwivedi) దర్శకత్వం వహించాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) నిర్మించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న విడుదల అయింది. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ ను రూ. 200కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర విజయం సాధించలేదు. పూర్తి రన్లో దాదాపుగా రూ. 65కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశముందని ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు.
‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోతే అక్షయ్ కుమార్ మసాలా కమర్షియల్ సినిమాల్లో నటిస్తానని చెప్పాడు. అక్షయ్ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ దర్శకుడైన చంద్ర ప్రకాష్ ద్వివేదితో ఈ మాటలను అన్నాడు. చంద్ర ప్రకాష్ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించాడు. ‘‘ ‘రౌడీ రాథోర్’, ‘హౌస్ఫుల్’ వంటి సినిమాల్లో నటిస్తే రెమ్యూనరేషన్ అధికంగా వస్తుందని అక్షయ్ ఒక సందర్భంలో చెప్పాడు. ఓ ప్రయత్నంగా అతడు ఈ సినిమా ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ చేశాడు. ప్రజలు ఈ చిత్రాన్ని చూడకపోతే వివాదాలకు దూరంగా ఉండే మసాలా, కమర్షియల్ సినిమాలు చేస్తానని పేర్కొన్నాడు. సినిమా ప్లాప్ అయితే నిర్మాతలు బాధపడతారు. యశ్రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన మొదటి హిస్టారికల్ చిత్రం ఇది. ఈ సినిమా విజయం సాధిస్తే ఇటువంటి వాటిని మరిన్ని రూపొందిస్తారు. పరాజయం పాలైతే కమర్షియల్ మూవీస్ వైపు వారు మెగ్గు చూపుతారు’’ అని చంద్ర ప్రకాష్ ద్వివేది తెలిపాడు.