బాలీవుడ్ ఎంట్రీ గురించి అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. హిందీ నటుల్లో ఎవరెవరితో నటించాలని ఉందని అడిగితే..
ABN , First Publish Date - 2022-01-08T22:23:44+05:30 IST
తన నటన, డ్యాన్స్తో యూత్ను మెస్మరైజ్ చేసి ఐకాన్ స్టార్గా ఎదిగిన నటుడు అల్లు అర్జున్. ‘‘ అల వైకుంఠపురంలో ’’ సినిమాతో
తన నటన, డ్యాన్స్తో యూత్ను మెస్మరైజ్ చేసి ఐకాన్ స్టార్గా ఎదిగిన నటుడు అల్లు అర్జున్. ‘‘ అల వైకుంఠపురంలో ’’ సినిమాతో టాలీవుడ్కు అతిపెద్ద బాక్సాఫీస్ హిట్ను అందించారు. తాజాగా అతడు హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘‘ పుష్ప’’. లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే పాత్రలో నటించారు. డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్తో దూసుకుపొతుంది. తాజాగా పుష్పరాజ్ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
బాలీవుడ్లో ఏ దర్శక నిర్మాతలతో పనిచేయాలని ఉందని బన్నీని ఈ ఇంటర్వ్యూలో అడిగితే.. ‘‘ బాలీవుడ్లో చాలా మంచి దర్శకులున్నారు. మంచి స్క్రిఫ్ట్తో ఏ దర్శకుడు వచ్చినా తప్పకుండా నటిస్తాను. మంచి ప్రాజెక్టులో భాగం కావాలని నాకు ఉంది. ఇప్పటి వరకు ఒక్కరు కూడా నన్ను సంప్రదించలేదు. గతంలో కొన్ని పార్టీల్లో దర్శకులను కలిసిన మాట వాస్తవమే. ఏ ప్రాజెక్టులోనైనా భాగం అయితే తప్పకుండా ప్రకటిస్తాను. కానీ, ఇప్పటి వరకు ఏది కూడా ఫైనలైజ్ కాలేదు ’’ అంటూ అల్లు అర్జున్ సమాధానం చెప్పారు.
అదే సమయంలో బాలీవుడ్లో ఏ హీరోతోనయినా, ఏ హీరోయిన్తో అయినా నటించాలని ఉందా..? అని ఆ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ను అడిగారు. ‘‘ నాకు స్క్రిఫ్ట్ అనేది చాలా ముఖ్యం. స్క్రిఫ్ట్ డిమాండ్ మేరకు ఎవరయితే నటిస్తారో వారితో సినిమా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు వ్యక్తిగతంగా ఇష్టమైనవారు ఎవరు లేరు..’’ అంటూ బన్నీ సమాధానం చెప్పుకొచ్చారు. ‘‘ పుష్ప’ చిత్రంలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు మంచి నటుడు కావాలి. అందువల్ల ఫహద్ ఫాజిల్ను తీసుకున్నాం. ఆ పాత్ర గురించి చెప్పగానే ఫహద్ నటించడానికి ఒప్పుకున్నారు. ఫహద్ ఆ పాత్రను పోషించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ’’ అని ఐకాన్ స్టార్ తెలిపారు.
‘‘ పుష్ప: ది రైజ్ ’’ సినిమా హిట్ అవ్వడంతో 2వ భాగమైన ‘‘ పుష్ప: ది రూల్ ’’ పై మంచి అంచనాలున్నాయని వివరించారు. మరో 2 నెలల్లో పుష్ప 2 షూటింగ్ను ప్రారంభిస్తామన్నారు. షూటింగ్ మొదలవ్వడానికి నెల రోజులకు పైగా సమయం ఉండటంతో రెస్ట్ తీసుకుంటున్నానని స్పష్టం చేశారు.