Allu Arjun: దక్షిణాదిలో ఇప్పుడు అల్లు అర్జున్ టాప్?
ABN , First Publish Date - 2022-09-06T23:20:21+05:30 IST
ఒకప్పుడు ప్రపంచమంతా ప్రభంజనం సృష్టించిన సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) ఇప్పుడు అంతగా ప్రభావం చూపలేకపోతున్నారు. ప్రజాదరణ అయితే ఏమీ తగ్గలేదు కానీ, ఆయన సినిమాలు ఇంతకు
ఒకప్పుడు ప్రపంచమంతా ప్రభంజనం సృష్టించిన సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) ఇప్పుడు అంతగా ప్రభావం చూపలేకపోతున్నారు. ప్రజాదరణ అయితే ఏమీ తగ్గలేదు కానీ, ఆయన సినిమాలు ఇంతకు ముందులా ఆడటం లేదు. ఎందుకంటే, ఆయన చాలా సీనియర్ అయిపోయాడు. ఇప్పుడు రజనీ వయసుకి తగ్గ సినిమాలు తీస్తే బాగుంటుంది కానీ అలా చేయడం లేదు. అలాగే టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రభావం కూడా గట్టిగానే వుంది కానీ.. ఆయన చివరి మూడు సినిమాలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరియు మహేష్ బాబు (Mahesh Babu).. ఇంకా తెలుగుకే పరిమితమయ్యారు. ఇటువంటి సమయంలో అల్లు అర్జున్ (Allu Arjun) ఒక్క సినిమాతో ప్రపంచమంతటికి తానేమిటో చూపించాడు. ‘పుష్ప’ (Pushpa) అనే సినిమా మొదట తెలుగులోనే తీసినా, ఆ తర్వాత మిగతా అన్ని భాషల్లోనూ విడుదలై, ప్రభంజనం సృష్టించింది. కలెక్షన్స్లోనూ అద్భుతంగా రాణించింది. అల్లు అర్జున్ని ఆ సినిమా ఎంతవరకు తీసుకెళ్ళిందీ అంటే.. ప్రపంచమంతా ఆయన గురించి మాట్లాడుకునేలా చేసింది.
అంతే కాకుండా.. ఓ ప్రముఖ జాతీయ పత్రిక అల్లు అర్జున్ ముఖచిత్రాన్ని కవర్ పేజీపై ముద్రించి ఆర్టికల్ రాసుకొచ్చింది. దక్షిణాది సినిమా అంటే అల్లు అర్జున్ అనేట్టు ‘పుష్ప’ సినిమా చేసింది. తమిళ నటులైన అజిత్ (Ajith), విజయ్ (Vijay) వంటి వాళ్ల సినిమాలు కూడా ఈ రేంజ్లో నడవలేదు. ఒకప్పుడు రజనీకాంత్ మరియు చిరంజీవి వంటి నటులు ప్రాతినిధ్యం వహించిన దక్షిణాది (సౌత్) సినిమాకి ఇప్పుడు అల్లు అర్జున్ ప్రతినిధి అయ్యాడు. ‘పుష్ప’ రెండో పార్టు ఎప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులు ఎదురు చూసేట్టు చేశాడు. అయితే అల్లు అర్జున్ అంత ఘనత సాధించాడంటే.. అందులో దర్శకుడు సుకుమార్ (Sukumar) గొప్పతనం కూడా చాలా వరకు ఉంది. ఎందుకంటే ఆ ‘పుష్ప’ పాత్రని తయారు చేసింది ఆయనే కదా. పాత్రని సుకుమార్ తయారు చేస్తే.. అల్లు అర్జున్ తన నటనతో ప్రాణం పోశాడు. ఈ పాత్ర కోసం అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డాడనేది సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. కష్ట పడితే ఫలితం ఎలా ఉంటుందో.. ఈ సినిమాతో అల్లు అర్జున్ కూడా తెలిసింది. అందుకే ‘పుష్ప’ రెండో పార్ట్ను.. పార్ట్ వన్ కన్నా అద్భుతంగా, అంతర్జాతీయంగా ఉండేట్టు తీర్చిదిద్దాలని అల్లు అర్జున్, సుకుమార్ అనుకుంటున్నారు.