నీకు అన్నీ నేనే
ABN , First Publish Date - 2022-08-14T06:12:05+05:30 IST
సతీష్ మేరుగు కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఏయ్ బుజ్జీ.. నీకు నేనే’....
సతీష్ మేరుగు కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఏయ్ బుజ్జీ.. నీకు నేనే’. హృతికా సింగ్ కథానాయిక. ఇటీవల హైదరాబాద్లో ఆడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఆ కష్టమంతా ఫస్ట్ కాపీ చూడగానే తొలగిపోయింది. అంత బాగా వచ్చింది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలూ ఈ కథలో ఉన్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’న్నారు.