హిట్ కాంబో మరోసారి
ABN , First Publish Date - 2022-07-04T07:08:34+05:30 IST
సుమంత్ కథానాయకుడిగా నటించిన ‘సుబ్రహ్మణ్యపురం’ మంచి విజయాన్ని అందుకొంది....
సుమంత్ కథానాయకుడిగా నటించిన ‘సుబ్రహ్మణ్యపురం’ మంచి విజయాన్ని అందుకొంది. ఆ చిత్రానికి సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో సినిమా సిద్ధమవుతోంది. కే.ఆర్ క్రియేషన్స్ పతాకంపై కే.ప్రదీప్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘‘పురాతన దేవాలయం నేపథ్యంలో సాగే కథ ఇది. థ్రిల్లింగ్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. త్వరలోనే సెట్స్పైకి తీసుకెళ్తాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మరికొద్ది రోజుల్లో ప్రకటిస్తామ’’ని నిర్మాత తెలిపారు.